Market Opening: రికార్డుల ర్యాలీలో కొంత ఒడిదొడుకుల తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో ప్రీఓపెనింగ్ సెషన్లోనూ లాభాలను నమోదు చేశాయి.
ఉదయం 9.16 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 365 పాయింట్ల లాభంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 104 పాయింట్లు గెయిన్ అయ్యింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 201 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 283 పాయింట్ల మేర లాభాలతో ముందుకు సాగుతున్నాయి. నిన్న అమెరికా మార్కెట్లు లాభాల ర్యాలీని కొనసాగించటంతో పాటు నేడు ఆసియా మార్కెట్లు సానుకూలంగా ట్రేడ్ అవ్వటం కలిసొచ్చే అంశంగా ఉంది. ప్రస్తుతం ప్రపంచ ఇన్వెస్టర్లు అమెరికా ద్రవ్యోల్బణం డేటా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఎన్ఎస్ఈలో నెస్లే, టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ, హీరో మోటార్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, బీపీసీఎల్, ఓఎన్జీసీ, విప్రో, టాటా కన్జూమర్, ఎస్బీఐ లైఫ్, కోల్ ఇండియా, ఐషర్ మోటార్స్, రిలయన్స్, సన్ ఫార్మా, గ్రాసిమ్, దివీస్ ల్యాబ్, అపోలో హాస్పిటల్స్, పవర్ గ్రిడ్, టీసీఎస్, ఎల్ టిఐఎమ్, ఇన్ఫోసిస్, యూపీఎల్, హిందాల్కొ, ఎయిర్ టెల్, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఎస్బీఐ, బజాజ్ ఫిన్ సర్వ్, టైటాన్, టాటా స్టీల్, టాటా మోటార్స్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.
ఈ క్రమంలో మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ కంపెనీల షేర్లు మాత్రమే నష్టాలతో టాప్ లూజర్ల జాబితాలో నిలిచాయి. ఈరోజు మార్కెట్ ఓపెనింగ్ ముందర బ్రాక్ డీల్ సెషన్లో నిప్పాన్, ఆస్ట్రల్, శ్రీరామ్ పిస్టన్స్ కంపెనీల షేర్లు పెద్ద మెుత్తంలో చేతులు మారాయి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications