శుక్రవారం స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల 34 నిమిషాలకు బీఎస్ఈ సెన్సెక్స్ 257 పాయింట్లు పెరిగి 79500 రికార్డ్ స్థాయిలో ట్రేడవుతోంది.ఎన్ఎస్ఈ నిఫ్టీ 78 పాయింట్ల లాభపడి 24122 వద్ద కొనసాగుతోంది. రిలయన్స్ జియో, ఎయిర్ టెల్ రీఛార్జ్ ప్లాన్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. దీంతో ఆ స్టాక్ ల్లో ర్యాలీ కనిపిస్తోంది. భారతి ఎయిర్టెల్ శుక్రవారం తన ప్రీపెయిడ్ మరియు పోస్ట్పెయిడ్ వినియోగదారులందరికీ సగటు ఆదాయాన్ని (ARPU) పెంచే ప్రయత్నంలో టారిఫ్లను పెంచింది. జియో ఇప్పటికే టారిఫ్ లను పెంచింది. వోడఫోన్ ఐడియా కూడా టారిఫ్ లను పెంచే అవకాశం ఉంది.
బీఎస్ఈ 30 ఇండెక్స్ లో ఎన్టీపీసీ, టాటా మోటార్స్, నెస్లే ఇండియా, టాటా స్టీల్, రిలయన్స్, పవర్ గ్రిడ్, భారతీ ఎయిర్ టెల్, హిందుస్థాన్ యూనిలీవర్, ఏసియన్ పెయింట్స్, సన్ ఫార్మా, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్ సర్వ్, టైటాన్, జేఎస్ డబ్ల్యూ స్టీల్, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్ లాభాల్లో ట్రేడవుతోన్నాయి. యాక్సెస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎల్అండ్ టీ, హెచ్ సీఎల్ టెక్, మారుతి, ఎంఅండ్ఎం, అల్ట్రాటెక్ సిమెంట్, అదానీపోర్ట్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్ నష్టాల్లో కొనసాగుతోన్నాయి.

నిఫ్టీలో రిలయన్స్ ఇండస్ట్రీస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, భారతీ ఎయిర్టెల్, దివీస్ ల్యాబ్స్, ఓఎన్జిసి ప్రధాన లాభాల్లో ఉండగా, అల్ట్రాటెక్ సిమెంట్, ఇండస్ఇండ్ బ్యాంక్, గ్రాసిమ్, అదానీ పోర్ట్స్, ఎం అండ్ ఎం నష్టపోయాయి. హెచ్సిఎల్ టెక్నాలజీస్కు చెందిన 1.24 కోట్ల ఈక్విటీ షేర్లు జూన్ 28 శుక్రవారం నాడు మొత్తం రూ. 1,788.3 కోట్లకు బ్లాక్ డీల్స్లో విక్రయించారు. విక్రయదారులు లేదా కొనుగోలుదారుల వివరాలు వెంటనే తెలియరాలేదు. బ్లాక్ డీల్లో హెచ్సిఎల్ టెక్నాలజీస్లో 0.45 శాతం ఈక్విటీ వాటా ఒక్కో షేరుకు రూ. 1,440.5గా మారిందని సిఎన్బిసి టివి 18 నివేదించింది. ఇది మునుపటి ముగింపుతో పోలిస్తే దాదాపు 1 శాతం తగ్గింపుతో ఉంది. జూన్ 27, గురువారం నాడు హెచ్సిఎల్ టెక్ షేర్లు 0.8 శాతం పెరిగి రూ.1,455 వద్ద ముగిసింది.


Click it and Unblock the Notifications