శుక్రవారం స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 7 పాయింట్ల నష్టపోయి 75,410 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 10 పాయింట్ల కోల్పోయి 22,957 వద్ద ముగిసింది. బీఎస్ఈ 30 ఇండెక్స్ లో హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, భారతి ఎయిర్ టెల్, ఎల్అండ్ టీ, యాక్సెస్ బ్యాంక్, ఎన్టీపీసీ, అల్ట్రాటెక్ సిమెంట్, మారుతి, ఇండస్ ఇండ్, బజాజ్ ఫైనాన్స్ లాభాల్లో ముగిశాయి.
టాటా మోటార్స్, టాటా స్టీల్, నెస్లే ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, పవర్ గ్రిడ్, రిలయన్స్, ఎస్బీఐఎన్, బజాజ్ ఫిన్ సర్వ్, కోటక్ మహీంద్రా బ్యాంకు, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, హిందుస్థాన్ యూనిలీవర్, విప్రో, హెచ్ సీఎల్ టెక్, ఐటీసీ, జేఎస్ డబ్ల్యూ స్టీల్, టాటైన్, ఎంఅండ్ఎం, టీసీఎస్, ఏసియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ 50లో హెచ్ డీఎఫ్ సీ, ఎల్అండ్ టీ, భారతి ఎయిర్ టెల్ టాప్ గెయినర్ గా ఉన్నాయి.

రిలయన్స్, టీసీఎస్, ఐటీసీ, ఇన్ఫోసిస్ టాప్ లూసర్ గా ఉన్నాయి. ఎఫ్ఎమ్సిజి, రియల్టీ స్టాక్ ల్లో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ఆటో, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగాలు మంచి పనితీరును కనబరిచాయి. సెక్టార్లలో, ఆయిల్ & గ్యాస్, క్యాపిటల్ గూడ్స్, టెలికాం, మీడియా 0.5-2% లాభపడగా, ఎఫ్ఎంసీజీ, హెల్త్కేర్, ఐటీ, మెటల్, రియల్టీ 0.5% చొప్పున క్షీణించాయి. బిఎస్ఇ మిడ్క్యాప్ ఇండెక్స్ ఐపి 0.2%, స్మాల్క్యాప్ ఇండెక్స్ 0.2% పడిపోయింది.
సానుకూల దేశీయ మార్కెట్లు, ఆర్బీఐ జోక్యం అనుమానంతో భారతీయ రూపాయి నేడు 0.25% పెరిగింది. ఆర్బీఐ ప్రభుత్వానికి రూ.2.11 లక్షల కోట్ల డివిడెండ్ కూడా మార్కెట్ సెంటిమెంట్ను పెంచింది. తాజా ఎఫ్ఐఐ ఇన్ఫ్లోలు, ముడి చమురు ధరల క్షీణత కూడా రూపాయికి మద్దతు ఇచ్చాయి. శుక్రవారం ఫినోలెక్స్ 12 శాతానికి పైగా పెరిగాయి. షేరు ప్రైస్ రూ.1,283.75 వద్ద ముగిసింది.


Click it and Unblock the Notifications