స్టాక్ మార్కెట్లలో ఒడిదుడుకులు కొనసాగుతోన్నాయి. ఓ రోజు పెరిగితే మరో రోజు మార్కెట్లు పడిపోతున్నాయి. శుక్రవారం స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటల 55 నిమిషాలకు బీఎస్ఈ సెన్సెక్స్ 786 పాయింట్లు పెరిగి 79,673 వద్ద ట్రేడవుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 225 పాయింట్లు వృద్ధి చెంది 24,342 వద్ద కొనసాగుతోంది. ఐటీ, ఆటో రంగాలు రాణిస్తున్నాయి.
బీఎస్ఈ 30 ఇండెక్స్ లో టాటా మోటార్స్, హెచ్ సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, ఎంఅండ్ఎం, టీసీఎస్, భారతి ఎయిర్ టెల్, రిలయన్స్, ఇన్ఫోసిస్, ఎల్అండ్ టీ, జేఎస్ డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, పవర్ గ్రిడ్, బజాజ్ ఫిన్ సర్వ్, నెస్లే ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్, ఎస్బీఐఎన్, బజాజ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్, మారుతి, ఐటీసీ, సన్ ఫార్మా, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఏసియన్ పెయింట్స్ లాభాల్లో ఉన్నాయి హిందస్థాన్ యూనిలీవర్, ఇండస్ ఇండ్ బ్యాంక్ నష్టాల్లో ట్రేడవుతోన్నాయి.

ఎన్ఎస్ఈ నిఫ్టీలో రిలయన్స్, హెచ్ డీఎఫ్ సీ, ఇన్ఫోసిస్, భారతి ఎయిర్ టెల్, టీసీఎస్ టాప్ గెయినర్లుగా ఉన్నాయి. సిప్లా, హెచ్ డీఎఫ్ సీ లైఫ్, ఆపోలో ఆస్పిటల్స్ టాప్ లూజర్లుగా ఉన్నాయి. ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్, ఎలక్ట్రిక్ వెహికల్ మార్గదర్శకుడు, స్టాక్ మార్కెట్లో అరంగేట్రం చేసింది, ఒక్కో షేరు ఇష్యూ ధర రూ.76 వద్ద లిస్టింగ్ అయింది. కేవలం 4.45 రెట్లు సబ్స్క్రిప్షన్తో పాటు, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పొందడంలో కంపెనీ ఎదుర్కొంటున్న సవాళ్లను ఎదుర్కొంది.
EV మార్కెట్ కోసం Ola ఎలక్ట్రిక్ దృష్టి ప్రతిష్టాత్మకంగా ఉన్నప్పటికీ, కంపెనీ ప్రస్తుత ఆర్థిక పనితీరు ఆందోళన కలిగిస్తోంది. జూన్ 30, 2024తో ముగిసిన త్రైమాసికంలో ప్రభుత్వ రంగ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆగస్టు 8న ఏకీకృత నికర లాభం రూ. 10,544 కోట్లతో 9 శాతం పెరిగి రూ. 9,635 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.
More From GoodReturns

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications