స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటల 23 నిమిషాలకు బీఎస్ఈ సెన్సెక్స్ 148 పాయింట్లు పెరిగి 80108 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 25 పాయింట్ల లాభపడి 24349 ట్రేడవుతోంది. బీఎస్ఈ 30 ఇండెక్స్ లో మారుతి, టైటాన్, టీసీఎస్, ఎంఅండ్ఎం, ఎల్అండ్ టీ, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, ఐటీసీ, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, బజాజ్ ఫిన్ సర్వ్, టాటా మోటార్స్, ఎస్బీఐఎన్, భారతీ ఎయిర్ టెల్, ఐసీఐసీఐ బ్యాంక్ లాభాల్లో కొనసాగుతోన్నాయి.
నెస్లే ఇండియా, ఏసియన్ పెయింట్స్, జేఎస్ డబ్ల్యూ స్టీల్, పవర్ గ్రిడ్, కోటక్ మహీంద్రా బ్యాంక్, సన్ ఫార్మా, హెచ్ సీఎల్ టెక్, యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, హిందుస్థాన్ యూనిలీవర్, ఎన్టీపీసీ, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, టెక్ మహీంద్రా, రిలయన్స్ నష్టాల్లో కొనసాగుతోన్నాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ 50లో మారుతి, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, ఐటీసీ, ఎల్అండ్ టీ, ఎంఅండ్ఎం టాప్ గెయినర్స్ గా కొనసాగుతోన్నాయి.

రిలయన్స్, ఓఎన్జీసీ, డా రెడ్డీస్, యాక్సిక్ బ్యాంక్, ఎన్టీపీసీ టాప్ లూజర్స్ గా ట్రేడవుతున్నాయి. రెండు రోజుల కన్సాలిడేషన్ తర్వాత, నిఫ్టీ మరియు సెన్సెక్స్ ఆటో, ఫార్మా స్టాక్ల నుంచి బలమైన లాభాలతో ప్రారంభమయ్యాయి. మరోవైపు, ఈ వారం ఆదాయాల కంటే ముందు ఐటీ షేర్లు పడిపోయాయి. సెక్టోరల్ ఇండెక్స్లలో నిఫ్టీ అన్ని సూచీలు గ్రీన్లో ట్రేడవుతున్నాయి. మారుతీ సుజుకీ బలంతో ఆటో రంగం దూసుకుపోతోంది.
నిఫ్టీ బ్యాంక్, ఐటీ, పీఎస్యూ బ్యాంక్, మెటల్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫార్మా, ఎఫ్ఎంసీజీ, ఆయిల్ అండ్ గ్యాస్ సహా అన్ని రంగాలు దూసుకుపోతున్నాయి. రియల్టీ ఇండెక్స్ ఓపెనింగ్లో బుల్లిష్ నోట్లో ఉంది, ఇది వెంటనే ఫ్లాట్ జోన్లోకి జారడం కనిపించింది.మిడ్క్యాప్ మరియు స్మాల్క్యాప్ ఇండెక్స్ (విస్తృత మార్కెట్) విషయానికొస్తే, జూలై ప్రారంభం నుంచి మిడ్ క్యాప్ ఇండెక్స్ 2 శాతం లాభపడింది.


Click it and Unblock the Notifications