ముంబై: ఇరాన్-అమెరికా మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా ముడి చమురు పెరగడం, బంగారం ధరలు పెరుగుతుండటం, రూపాయి క్షీణించడంతో సూచీలు కుప్పకూలాయి. దీంతో పాటు దేశీయ కంపెనీలు డిసెంబర్ త్రైమాసిక ఫలితాలపై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టడం కూడా మార్కెట్ సెంటిమెంటును మరింత దెబ్బతీసింది.
ఉదయం గం.9.40 సమయానికి సెన్సెక్స్ 459 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 138 పాయింట్లు నష్టపోయింది. డాలర్తో రూపాయి మారకం విలువ 26 పైసలు క్షీణించి 72.05 వద్ద ట్రేడ్ అయింది. ఐటీ మినహా అన్ని రంగాల షేర్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. సెన్సెక్స్ మధ్యాహ్నం గం.11.13 నిమిషాలకు 511.28 (1.23%) పాయింట్లు నష్టపోయి 40,953.33 వద్ద, నిఫ్టీ 155.30 (1.27%) పాయింట్లు నష్టపోయి 12,071.35 వద్ద ట్రేడ్ అయింది.
సాయంత్రం మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ ఏకంగా 788 పాయింట్లు నష్టపోయి 40,676.63 వద్ద ట్రేడ్ అయింది. 41వేల మార్క్ దిగువకు చేరుకుంది. గత నాలుగు నెలల కాలంలో ఒక రోజులో సెన్సెక్స్ ఇంతలా పడిపోవడం ఇదే మొదటిసారి. నిఫ్టీ 234 పాయింట్లు నష్టపోయి 11,993 వద్ద ట్రేడ్ అయింది. గత ఆరు నెలల కాలంలో ఒక రోజులో నిఫ్టీ ఇంతలా పడిపోవడం ఇది మొదటిసారి.

అమెరికా - ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో అన్ని రంగాల షేర్లు ఒత్తిడికి గురయ్యాయి. ఎస్బీఐ, మారుతీ సుజుకీ, ఆసియన్ పేయింట్స్ షేర్లు భారీగా నష్టపోయాయి. టైటాన్, హెచ్సీఎల్ టెక్, టీసీఎస్ స్వల్పంగా లాభపడ్డాయి. బంగారం, వెండి ధరలు భారీగా నష్టపోయాయి.
More From GoodReturns

Sensex today: సెన్సెక్స్ సంచలనం: 20 నిమిషాల్లో 900 పాయింట్లు జంప్.. కారణం ఇదే!

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

భారత స్టాక్ మార్కెట్లు పతనం.. చమురు ధరలు పెరగడంతో కుప్పకూలిన మార్కెట్

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications