stock Market today: ఫ్లాట్గా ముగిసిన స్టాక్ మార్కెట్లు
స్టాక్ మార్కెట్లు మంగళవారం(నవంబర్ 9, 2021) ఫ్లాట్గా ప్రారంభమై, అలాగే ముగిశాయి. వరుసగా 2 వారాలు నష్టపోయిన మార్కెట్లు గత దీపావళి వారం లాభాల్లో ముగిశాయి. ఈ వారం కూడా లాభాలతో ప్రారంభమయ్యాయి. నిన్న సెన్సెక్స్ 478 పాయింట్లు, నిఫ్టీ 152 పాయింట్లు లాభపడింది. అయితే ఇన్వెస్టర్లు నేడు ప్రాఫిట్ బుకింగ్కు మొగ్గు చూపారు. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్ అయ్యాయి. అమెరికా మార్కెట్లు సోమవారం రికార్డుస్థాయి లాభాల్లో ముగిశాయి. అయినప్పటికీ గతవారం, అలాగే, ఈ వారంలోని రెండు రోజుల లాభాల నేపథ్యంలో ప్రాఫిట్ బుకింగ్ వల్ల మార్కెట్లు స్థిరంగా లేదా అతి స్వల్ప నష్టాల్లో ముగిశాయి.
దీనికి తోడు ఎంఎస్సీఐ సూచీలో ఏడు భారత కంపెనీలను చేర్చనుండటం మార్కెట్లపై ప్రభావం చూపింది. అమెరికాలో ఇన్ఫ్రా బిల్లు ఆమోదం పొందనుండడం కూడా సూచీలపై ప్రభావం చూపింది. ఉదయం 60,609.72 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్, 60,670.47 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకి, 60,213.64 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 18,084.35 పాయింట్ల వద్ద ప్రారంభమై, 18,112.60 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,983.05 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది.
విజిల్ బ్లోయర్స్ ప్రభావంతో నిన్న నష్టపోయిన ఇండస్ఇండ్ బ్యాంకు స్టాక్ నేడు లాభపడింది. నేడు ఈ స్టాక్ 0.74 శాతం లాభపడి రూ.1,069.00 వద్ద ఉంది. నిన్న ఇండస్ఇండ్ బ్యాంకులో రుణాల పునరుద్ధరణపై విజిల్ బ్లోయర్స్ చేసిన ఆరోపణలు దానిపై సంస్థ ఇచ్చిన వివరణ నేపథ్యంలో బ్యాంకు షేర్లు ఓ దశలో 12 శాతానికి పైగా కుంగాయి. నిన్న బీఎస్ఈలో స్టాక్ ధర 12.40 శాతం కుంగి రూ.1,041.60కు చేరుకుంది. ఎన్ఎస్ఈలో రూ.12.40 శాతం పతమైంది. ఇండస్ఇండ్ బ్యాంకు షేర్ 52 వారాల గరిష్టం రూ.1,242.00, 52 వారాల కనిష్టం రూ.735.05.