ఇరాన్ టాప్ కమాండర్ మృతి: చమురు భయాలు, నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

భారత్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఇరాన్ జనరల్ లక్ష్యంగా అమెరికా చేసిన రాకెట్ దాడితో చమురు ధరలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ ప్రభావం మన మార్కెట్లపై పడింది. మార్కెట్లకు చమురు భయాలు పట్టుకున్నాయి. దీంతో ఈ రంగంలోని షేర్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 140 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 40 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఐటీ మినహా అన్ని రంగాల షేర్లు ఉదయం నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి.

ఆయిల్ అండ్ మార్కెటింగ్ (OMC) షేర్లు ఉదయం పడిపోయాయి. మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయిల్ ధరలు మూడు నెలల గరిష్టానికి చేరుకోవడంతో షేర్లు పడిపోయాయి.

Stock Market: Sensex falls 130 pts, Nifty slips below 12,250

మధ్యాహ్నం గం.11.11 సమయానికి సెన్సెక్స్ 136.74 (0.33%) పాయింట్లు నష్టపోయి 41,489.90, నిఫ్టీ 41.30 (0.34%) పాయింట్లు కోల్పోయి 12,240.90 వద్ద ట్రేడ్ అయింది. కాగా, ఏడు ఆయిల్ బ్లాక్స్ అంశంలో గెలుపు నేపథ్యంలో ఓఎన్జీసీ షేర్లు మధ్యాహ్నానికి నాలుగు శాతం లాభాల్లో ట్రేడ్ అయ్యాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+