స్టాక్ మార్కెటుకి మళ్ళీ ఏమైంది.. నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ.. 6 నెలల్లో లక్షల కోట్లు..

ఈ వారంలో కాస్త తిరిగి కోలుకుంటున్న స్టాక్ మార్కెట్ మళ్ళీ కుప్ప కూలింది. దింతో నేడు బిఎస్‌ఇ సెన్సెక్స్ 728.69 పాయింట్లు తగ్గి 77,288.50 వద్ద ముగియగా, ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ కూడా 181.80 పాయింట్లు కోల్పోయి 23,486.85కి పడిపోయింది. షేర్ మార్కెట్లో ఈ క్షీణతకి చాల కారణాలు చెప్పవచ్చు. చివరికి ఇవాళ బుధవారం సెన్సెక్స్ భారీ పతనాన్ని నమోదు చేసి 728.69 పాయింట్లు తగ్గింది. ప్రస్తుతం 77,288.50 పాయింట్ల వద్ద ఉంది. నిఫ్టీ కూడా రెడ్ మార్క్‌లోనే కొనసాగుతూ 181.80 పాయింట్లు నష్టపోయి 23,486.85 పాయింట్ల వద్ద చేరింది.

stcokmarket crash BSE Sensex closed at 77 288 50 NSE Nifty closed at 23 486 85 know reason for decline in market

ఆధిపత్యం చెలాయిస్తున్న ప్రాఫిట్-బుకింగ్ : ఈరోజు పెట్టుబడిదారులు లాభాలను బుక్ చేసుకున్నారని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. స్టాక్ మార్కెట్ పుంజుకున్నప్పుడు కొంతమంది పెట్టుబడిదారులు లాభాలను ఉపసంహరించుకుని డబ్బును దక్కించుకుంటారు. ఇది కూడా మార్కెట్‌ క్షీణతకు దారితీసింది.

మార్కెట్ క్షీణతకు ఇతర కారణాలు ఏంటి : ప్రపంచ సుంకాలపై అనిశ్చితి కొనసాగుతోంది. ఈ కారణంగా భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లలో అస్థిరత నెలకొంది. ప్రపంచ వాణిజ్య దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ 2న కొన్ని పెద్ద నిర్ణయాలు తీసుకోవచ్చు. దినికి సంబంధించి ఇప్పటికే "కొన్ని మినహాయింపులు ఉంటాయి, కానీ చాలా ఉండవు" అని ట్రంప్ స్వయంగా అన్నారు. దీని అర్థం కొన్ని దేశాలు సుంకాల నుండి మినహాయింపు పొందనుండగా కానీ చాలా దేశాలు సుంకాలకు లోబడి ఉండవచ్చు. రూపాయి పతనం కూడా మార్కెట్లో ప్రతికూల వాతావరణాన్ని సృష్టించింది. బుధవారం భారత రూపాయి 6 పైసలు తగ్గి 85.78కి చేరుకుంది. అమెరికా డాలర్ బలపడటం వల్ల ఇలా జరిగింది.

మార్కెట్ ట్రెండ్ ఎలా ఉంది : సెన్సెక్స్‌లోని 30 కంపెనీలలో 25 కంపెనీలు క్షీణతతో ముగిశాయి. ఇండస్‌ఇంక్ బ్యాంక్, హెచ్‌సిఎల్ టెక్, మహీంద్రా & మహీంద్రా, టైటాన్, పవర్ గ్రిడ్ షేర్లు లాభపడ్డాయి. నిన్న సెన్సెక్స్ 78,017.19 పాయింట్ల వద్ద ముగిసింది. ఈరోజు కూడా అదే 78,021.45 పాయింట్ల వద్ద బలంగా ప్రారంభమైంది. రోజు మొత్తంలో 78,167.87 పాయింట్ల గరిష్ట స్థాయికి తాకింది. తరువాత గంటల్లో లాభాల బుకింగ్ మార్కెట్‌ను ఆధిపత్యం చేసింది. ఒకానొక సమయంలో సెన్సెక్స్ 77,194.22 పాయింట్ల కనిష్ట స్థాయికి చేరుకుంది.

మరికొద్ది రోజుల్లో 2025 ఆర్థిక సంవత్సరం ముగియబోతోంది. గత ఏడాది ప్రారంభంలో విదేశీ పెట్టుబడిదారులు భారత మార్కెట్లో చాలా డబ్బు పెట్టుబడి పెట్టారు కానీ తరువాత వారి మూడ్ మారిపోయింది. మొదటి ఆరు నెలల్లో విదేశీ పెట్టుబడిదారులు దేశీయ మార్కెట్లో దాదాపు రూ.28,000 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు, కానీ తరువాత ఆరు నెలల్లో రూ.2 లక్షల కోట్లకు పైగా విలువైన షేర్లను విక్రయించారు. ఈ ఏడాది మొత్తం ఉపసంహరణలు దాదాపు రూ.1.53 లక్షల కోట్లు (17.8 బిలియన్ డాలర్లు). విదేశీ పెట్టుబడిదారులు ఆర్థిక సేవలు, ఆయిల్ అండ్ గ్యాస్, FMCG, ఆటోమొబైల్స్, విద్యుత్ కంపెనీల షేర్లను ఎక్కువగా విక్రయించారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+