SBI Loans: భారతదేశంలోని ప్రభుత్వ యాజమాన్యంలో వ్యాపారాన్ని కొనసాగిస్తున్న అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వు బ్యాంక్ నిర్ణయాలకు అనుగుణంగా బ్యాంక్ తన వ్యాపారంలో అనేక మార్పులకు ఎప్పటికప్పుడు శ్రీకారం చుడుతుందని మనందరికీ తెలిసిందే.
ఈ క్రమంలో స్వాతంత్ర్య దినోత్సవం రోజైన ఆగస్టు 15న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు పెద్ద షాక్ ఇచ్చింది. ఈ క్రమంలో ఎస్బీఐ వివిధ పదవీకాలానికి సంబంధించిన మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్లను(MCLR) 10 బేసిస్ పాయింట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. పెంచబడిన కొత్త రేట్లు నేటి నుంచి అమలులోకి వచ్చాయి. ఎస్బీఐ ఎంసీఎల్ఆర్ని పెంచడం ఇది వరుసగా మూడో నెల కావటం గమనార్హం.

మారిన రేట్లను పరిశీలిస్తే.. మూడు సంవత్సరాల కాలానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త MCLR రేటు గతంలో ఉన్న 9% నుంచి 9.10%కి పెంచబడింది. ఇక ఇతర కాలాలకు పెరిగిన వడ్డీ రేట్లను పరిశీలిస్తే..
ఓవర్ నైట్ కాలానికి: 8.10% నుంచి 8.20%కి పెంపు
ఒక నెల కాలానికి: 8.35% నుంచి 8.45%కి పెరిగింది
మూడు నెలల కాలానికి: 8.40% నుంచి 8.50% పెంచబడింది
ఆరు నెలల కాలానికి: 8.75% నుంచి 8.85% పెంపు
ఏడాది కాలానికి: 8.85% నుంచి 8.95% పెంపు
రెండేళ్ల కాలానికి: 8.95% నుంచి 9.05%కి పెంపు
మూడు సంవత్సరాల కాలానికి: 9.00% నుంచి 9.10% పెరిగింది
ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంక్ జూన్ 2024 నుంచి నిర్దిష్ట కాలాల్లో MCLRని 30 బేసిస్ పాయింట్లు మేర క్రమంగా పెంచింది. MCLR రేటు పెంపుదల అంటే గృహ రుణం, కారు రుణం, విద్యా రుణాల వడ్డీ రేట్లు పెరగటం వల్ల వినియోగదారులపై ఈఎంఐ భారం పెరుగుతుంది. మునుపటి బేస్ రేట్ సిస్టమ్ స్థానంలో రుణ రేట్లకు బెంచ్మార్క్గా ఏప్రిల్ 2016లో MCLRని RBI ప్రవేశపెట్టింది. దీనివల్ల రిజర్వు బ్యాంక్ వడ్డీ రేట్ల మార్పులకు అనుగుణంగా రుణ రేట్లలో మార్పులు వస్తుంటాయి.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications