SBI News: ఖాతాదారులకు SBI బ్యాడ్ న్యూస్.. రుణగ్రహీతలకు భారీ ఝలక్

Interest News: దేశం గర్వించదగ్గ సంస్థల్లో భారతీయ స్టేట్ బ్యాంక్ ఒకటి. ఇండియాలో అతిపెద్ద బ్యాంకర్ గా దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తోంది. SBI తాజాగా తన కస్టమర్లకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఖాతాదారులపై భారం మోపేందుకు సిద్ధమైంది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన బేస్ లెండింగ్ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గతంలో ఉన్న 10.10 శాతానికి 15 బేసిస్ పాయింట్లు జోడించి 10.25 శాతానికి పెంచింది. దీని వలన రుణగ్రహీతలపై పెనుభారం పడనున్నట్లు తెలుస్తోంది. దీంతో గృహ, వాహన మరియు వ్యక్తిగత రుణాల EMIలు పెరిగవచ్చని భావిస్తున్నారు.

State Bank of India increased lending rates

బ్యాంక్‌ మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటు (MCLR)లో పెరుగుదల ఇప్పుడు 8 నుంచి 8.5 శాతం మధ్యలో ఉంది. పెరిగిన కొత్త రేట్లు డిసెంబరు 15 నుంచి అమల్లోకి వచ్చాయి. ఓవర్‌నైట్ MCLR రేటును బ్యాంక్ 8 శాతంగా నిర్ణయించింది. నెల మరియు 3 నెలల కాలపరిమితికి సంబంధించిన రేట్లను 8.15 శాతం నుంచి 8.20 శాతానికి పెంచింది.

దేశీయ దిగ్గజ బ్యాంకర్ వడ్డీ రేట్లను పెంచడంతో ఇతర బ్యాంకులు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తాయని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. వెరసి రుణాలు తీసుకున్న ఖాతాదారులపై దీని ప్రభావం భారీగా ఉండనున్నట్లు చెబుతున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+