Stand Up India: దేశంలో అట్టడుగు స్థాయిలో ఎస్సీ, ఎస్టీ, మహిళా పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సాధికారత, ఉద్యోగ కల్పన కోసం స్టాండ్ అప్ ఇండియా స్కీమ్ తీసుకురావటం జరిగింది. వారి ప్రోత్సాహం కోసం భారత ప్రభుత్వం ఈ పథకాన్ని ఏప్రిల్ 5, 2016లో స్కీమ్ను తీసుకొచ్చింది.
గడచిన 7 ఏళ్ల కాలంలో ఈ స్కీమ్ ద్వారా 1,80,000 మంది పారిశ్రామికవేత్తలు లబ్ధి పొందారు. ఈ క్రమంలో రూ.40,000 కోట్లను రుణాల రూపంలో మంజూరు చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. కేంద్రం విజయవంతమైన ఈ పథకాన్ని 2019-20లో 2025 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. మెుదటి ఆరేళ్ల కాలంలో ఈ స్కీమ్ కింద రూ.30,160 కోట్లను రుణాలుగా మంజూరు చేయగా.. కేవలం ఒక్క సంవత్సరంలో దాదాపు రూ.10,000 కోట్లను అర్హులకు పంపిణీ చేసి రికార్డు సృష్టించింది.

పథకం కింద ప్రయోజనం పొందిన మెుత్తం 1,80,000 మందిలో లబ్ధిదారుల్లో ఎక్కువ మంది అంటే 1,44,787 మంది మహిళలు కావటం విశేషం. లబ్ధిదారుల్లో 26,889 మంది షెడ్యూల్డ్ కులాలకు చెందినవారు, 8,960 మంది షెడ్యూల్డ్ తెగలకు చెందిన వారు ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఒక్కో మహిళకు రూ.10 లక్షల నుంచి రూ. కోటి వరకు రుణాన్ని పొందేందుకు వెసులుబాటు కల్పించబడింది. మ్యానుఫ్యాక్చురింగ్, సర్వీస్, ట్రేడింగ్, అగ్రికల్చర్ అనుబంధ కార్యకలాపాలకు ఈ సౌకర్యం ఉంది.
కేంద్ర ప్రభుత్వ స్కీమ్ కింద రుణాన్ని పొందేందుకు సదరు వ్యాపారి 51 శాతం వాటాలను కలిగి ఉండటం ప్రధాన అర్హతల్లో ఒకటి. స్కీమ్ కింద వ్యాపారాన్ని ప్రారంభించేందుకు రుణాన్ని పొందాలనుకుంటున్న ఎస్సీ, ఎస్టీ లేదా మహిళా పారిశ్రామికవేత్త వయస్సు 18 సంవత్సరాల కంటే ఎక్కవగా ఉండాల్సి ఉంటుంది.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: రియల్ ఎస్టేట్లో మారిన లెక్కలు! బెంగళూరు, హైదరాబాద్లో ట్రెండ్ ఎలా ఉందంటే..



Click it and Unblock the Notifications