మన పొరుగున ఉన్న శ్రీలంక ఆర్థిక, వాణిజ్య పరిస్థితులు రోజులు గడిచేకొద్దీ క్షీణిస్తూనే ఉన్నాయి. ద్వీప దేశంలోని కొత్త ప్రభుత్వం ఆదాయాన్ని పెంచే ప్రయత్నంలో అనేక ప్రభుత్వ సేవలు, ప్రభుత్వ-ప్రాయోజిత వస్తువుల ధరలను పెంచేసింది. తాజాగా విద్యుత్ ఛార్జీలను 75 శాతం పెంచేందుకు శ్రీలంక ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ మంగళవారం ఆమోదం తెలపటం విస్మయానికి గురిచేస్తోంది.

విద్యుత్ ఛార్జీలు..
శ్రీలంక పబ్లిక్ యుటిలిటీస్ కమిషన్ (PUCSL) ఛైర్మన్ జనక రతనాయకే మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ వివరాలను వెల్లడించారు. దీనికి సంబంధించి ప్రజలు, ఇతర వాటాదారుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత న్యాయమైన విద్యుత్ టారిఫ్ను ఆమోదించాలని కమిషన్ నిర్ణయించింది. శ్రీలంక విద్యుత్ బోర్డు (CEB) దీనికి అనుమతించింది. PUCSL డేటా ప్రకారం.. 2013 తర్వాత అత్యధికంగా విద్యుత్ టారిఫ్ 75% పెరగడం ఇదే మొదటిసారని తెలుస్తోంది.

PUCSL అధ్యక్షుడు జనక రత్నయ్య..
విద్యుత్ ఛార్జీల పెంపుదల ఆగస్టు 10 నుంచి అమల్లోకి వస్తుందని పీయూసీఎస్ఎల్ అధ్యక్షుడు జనక రత్నాయకే శ్రీలంక మీడియాకు వెల్లడించారు. ఈ నిర్ణయం ఇప్పటికే ఆదాయం, ఉపాధి లేకుండా అలమటిస్తున్న లక్షలాది లంక ప్రజలపై భారాన్ని మోపుతుంది.

0- 30 యూనిట్లు..
తాజా ప్రకటన ద్వారా.. శ్రీలంకలోని 0-30 యూనిట్ల వినియోగదారులకు ఆగస్టు 10 నుంచి 264% విద్యుత్ టారిఫ్ను పెంచేందుకు CEBకి అనుమతి లభించింది. దీంతో గరిష్ఠంగా రూ.198 ఫీజు చెల్లించవలసి ఉంటుందని తెలుస్తోంది.

ఇతర శ్లాబ్లపై పెంపు ఇలా..
31 నుంచి 60 యూనిట్లు ఉన్న వినియోగదారుల బిల్లులు 211 శాతం పెరిగి గరిష్ఠంగా రూ.599, 61-90 యూనిట్లపై 125 శాతం, 91-120 యూనిట్లపై 89 శాతం, 121 నుంచి 180 యూనిట్లపై 79 శాతం పెరుగుదల ఉంటుందని పీయూసీఎస్ఎల్ ఛైర్మన్ తెలిపారు.

డాలర్లలో చెల్లింపులు..
విదేశీ మారకం ద్వారా ఆదాయంలో 60 శాతానికి పైగా ఆర్జిస్తున్న.. పారిశ్రామిక, హోటల్ రంగాల్లోని విద్యుత్ వినియోగదారులు US డాలర్లలో విద్యుత్ బిల్లులను చెల్లించాలి. ఈ పథకం కింద కవర్ చేయబడిన వినియోగదారులు వారి విద్యుత్ బిల్లులపై 1.5% తగ్గింపు పొందుతారు.
ఈ స్కీమ్ సెప్టెంబర్ 1, 2022 నుంచి అమలులోకి వస్తుంది.

హోటళ్లపై భారీగా..
ఆగస్ట్ 10, 2022 నుంచి హోటల్ తరహా వినియోగదారులకు 50% టారిఫ్ పెంపు విధించబడుతుందని, మిగిలిన 50% నవంబర్ 10, 2022 నుంచి అమలులోకి వస్తుందని శ్రీలంక పబ్లిక్ యుటిలిటీస్ కమిషన్ తన ప్రకటనలో వెల్లడించారు. అంటే రానున్న కాలంలో పర్యాటక రంగంపై భారం పెరగనుంది. విదేశీ ప్రయాణికులకు హోటళ్లలో బస నుంచి మిగిలిన ఖర్చులు సైతం భారీగానే పెరుగుతాయని తెలుస్తోంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications