మన పొరుగున ఉన్న శ్రీలంక ఆర్థిక, వాణిజ్య పరిస్థితులు రోజులు గడిచేకొద్దీ క్షీణిస్తూనే ఉన్నాయి. ద్వీప దేశంలోని కొత్త ప్రభుత్వం ఆదాయాన్ని పెంచే ప్రయత్నంలో అనేక ప్రభుత్వ సేవలు, ప్రభుత్వ-ప్రాయోజిత వస్తువుల ధరలను పెంచేసింది. తాజాగా విద్యుత్ ఛార్జీలను 75 శాతం పెంచేందుకు శ్రీలంక ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ మంగళవారం ఆమోదం తెలపటం విస్మయానికి గురిచేస్తోంది.

విద్యుత్ ఛార్జీలు..
శ్రీలంక పబ్లిక్ యుటిలిటీస్ కమిషన్ (PUCSL) ఛైర్మన్ జనక రతనాయకే మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ వివరాలను వెల్లడించారు. దీనికి సంబంధించి ప్రజలు, ఇతర వాటాదారుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత న్యాయమైన విద్యుత్ టారిఫ్ను ఆమోదించాలని కమిషన్ నిర్ణయించింది. శ్రీలంక విద్యుత్ బోర్డు (CEB) దీనికి అనుమతించింది. PUCSL డేటా ప్రకారం.. 2013 తర్వాత అత్యధికంగా విద్యుత్ టారిఫ్ 75% పెరగడం ఇదే మొదటిసారని తెలుస్తోంది.

PUCSL అధ్యక్షుడు జనక రత్నయ్య..
విద్యుత్ ఛార్జీల పెంపుదల ఆగస్టు 10 నుంచి అమల్లోకి వస్తుందని పీయూసీఎస్ఎల్ అధ్యక్షుడు జనక రత్నాయకే శ్రీలంక మీడియాకు వెల్లడించారు. ఈ నిర్ణయం ఇప్పటికే ఆదాయం, ఉపాధి లేకుండా అలమటిస్తున్న లక్షలాది లంక ప్రజలపై భారాన్ని మోపుతుంది.

0- 30 యూనిట్లు..
తాజా ప్రకటన ద్వారా.. శ్రీలంకలోని 0-30 యూనిట్ల వినియోగదారులకు ఆగస్టు 10 నుంచి 264% విద్యుత్ టారిఫ్ను పెంచేందుకు CEBకి అనుమతి లభించింది. దీంతో గరిష్ఠంగా రూ.198 ఫీజు చెల్లించవలసి ఉంటుందని తెలుస్తోంది.

ఇతర శ్లాబ్లపై పెంపు ఇలా..
31 నుంచి 60 యూనిట్లు ఉన్న వినియోగదారుల బిల్లులు 211 శాతం పెరిగి గరిష్ఠంగా రూ.599, 61-90 యూనిట్లపై 125 శాతం, 91-120 యూనిట్లపై 89 శాతం, 121 నుంచి 180 యూనిట్లపై 79 శాతం పెరుగుదల ఉంటుందని పీయూసీఎస్ఎల్ ఛైర్మన్ తెలిపారు.

డాలర్లలో చెల్లింపులు..
విదేశీ మారకం ద్వారా ఆదాయంలో 60 శాతానికి పైగా ఆర్జిస్తున్న.. పారిశ్రామిక, హోటల్ రంగాల్లోని విద్యుత్ వినియోగదారులు US డాలర్లలో విద్యుత్ బిల్లులను చెల్లించాలి. ఈ పథకం కింద కవర్ చేయబడిన వినియోగదారులు వారి విద్యుత్ బిల్లులపై 1.5% తగ్గింపు పొందుతారు.
ఈ స్కీమ్ సెప్టెంబర్ 1, 2022 నుంచి అమలులోకి వస్తుంది.

హోటళ్లపై భారీగా..
ఆగస్ట్ 10, 2022 నుంచి హోటల్ తరహా వినియోగదారులకు 50% టారిఫ్ పెంపు విధించబడుతుందని, మిగిలిన 50% నవంబర్ 10, 2022 నుంచి అమలులోకి వస్తుందని శ్రీలంక పబ్లిక్ యుటిలిటీస్ కమిషన్ తన ప్రకటనలో వెల్లడించారు. అంటే రానున్న కాలంలో పర్యాటక రంగంపై భారం పెరగనుంది. విదేశీ ప్రయాణికులకు హోటళ్లలో బస నుంచి మిగిలిన ఖర్చులు సైతం భారీగానే పెరుగుతాయని తెలుస్తోంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications