ప్రముఖ సాఫ్ట్వేర్ దిగ్గజం జోహో కార్పొరేషన్ (Zoho Corporation) సహ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు (Sridhar Vembu) మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా రాజ్యమేలుతున్న గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి బిగ్ టెక్ కంపెనీలను ఆయన బ్రిటీష్ కాలం నాటి 'ఈస్ట్ ఇండియా కంపెనీ'తో పోల్చారు. ఈ సంస్థలకు ఉన్న ఆర్థిక బలం, వ్యూహాత్మక శక్తి ఇప్పుడున్న చాలా దేశాల కంటే కూడా ఎక్కువగా ఉందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

24 గంటల్లో 32 బిలియన్ డాలర్ల నిధులు!
శ్రీధర్ వేంబు ఈ వ్యాఖ్యలు చేయడానికి ఒక ప్రధాన కారణం ఉంది. గూగుల్ మాతృ సంస్థ అయిన ఆల్ఫాబెట్ (Alphabet) ఇటీవల కేవలం 24 గంటల వ్యవధిలో ఏకంగా 32 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 2.6 లక్షల కోట్లు) అప్పును సేకరించింది. సాధారణంగా ఏ దేశ ప్రభుత్వం అయినా ఇంత పెద్ద మొత్తంలో నిధులను సేకరించాలంటే నెలల తరబడి సమయం పడుతుంది. కానీ, ఒక ప్రైవేట్ టెక్నాలజీ సంస్థకు ఉన్న పరపతితో ఇది అతి తక్కువ సమయంలో సాధ్యమైంది.
అంతేకాకుండా ఆల్ఫాబెట్ సంస్థ 100 సంవత్సరాల కాలపరిమితితో బాండ్లను జారీ చేసింది. సాధారణంగా భారతదేశం వంటి దేశాలు ఇచ్చే బాండ్ల కాలపరిమితి 40 ఏళ్ల వరకు మాత్రమే ఉంటుంది. దీన్ని బట్టి బిగ్ టెక్ సంస్థలకు ప్రపంచ మార్కెట్లో ఎంతటి నమ్మకం, ఆర్థిక శక్తి ఉందో అర్థం చేసుకోవచ్చని శ్రీధర్ వేంబు పేర్కొన్నారు.
ఎందుకు ఈస్ట్ ఇండియా కంపెనీతో పోలిక?
బ్రిటీష్ కాలంలో ఈస్ట్ ఇండియా కంపెనీ కేవలం వ్యాపారం కోసం వచ్చి, తన ఆర్థిక బలంతో ఏకంగా దేశాల రాజకీయాలనే శాసించింది. ఇప్పుడున్న బిగ్ టెక్ సంస్థలు కూడా అదే బాటలో ఉన్నాయని వేంబు అభిప్రాయపడ్డారు. "ఈ కంపెనీలు సార్వభౌమ దేశాల కంటే పెద్దవి. వాటిని ఆధునిక కాలపు ఈస్ట్ ఇండియా కంపెనీలుగానే చూడాలి" అని ఆయన 'X' (ట్విట్టర్) వేదికగా రాసుకొచ్చారు.
టెక్నాలజీ రంగంలో గుత్తాధిపత్యం పెరగడం వల్ల దేశాల భద్రత, ఆర్థిక వ్యవస్థలపై ఆ కంపెనీల ప్రభావం పెరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ప్రతి దేశం తనకంటూ ఒక 'టెక్నాలజీ సార్వభౌమత్వం' (Technology Sovereignty) కలిగి ఉండాలని ఆయన గట్టిగా కోరుతున్నారు.
స్వదేశీ సాంకేతికతకు ప్రాధాన్యత
ఇటీవల ఫ్రాన్స్ దేశం జూమ్ (Zoom), మైక్రోసాఫ్ట్ టీమ్స్ (Microsoft Teams) వంటి అమెరికన్ ప్లాట్ఫారమ్లకు బదులుగా తన సొంత దేశీయ యాప్ 'విజియో' (Visio) ను ఉపయోగించాలని నిర్ణయించుకుంది. ఈ నిర్ణయాన్ని శ్రీధర్ వేంబు స్వాగతించారు. డిజిటల్ పవర్ ఒకే చోట కేంద్రీకృతమైతే అది భవిష్యత్తులో దేశాల విధాన నిర్ణయాలను కూడా ప్రభావితం చేసే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరిస్తున్నారు.
భారతదేశం కూడా సొంత డిజిటల్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేసుకోవాలని, విదేశీ సంస్థలపై ఆధారపడటం తగ్గించుకోవాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. టెక్నాలజీ అనేది కేవలం ఒక సౌకర్యం మాత్రమే కాదు. అది ఒక దేశం యొక్క ఆర్థిక, భౌగోళిక రాజకీయాలను మార్చే శక్తి అని శ్రీధర్ వేంబు మాటల ద్వారా స్పష్టమవుతోంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications