టాటాలపై ఆరోపణలు వెనక్కి తీసుకున్న షాపూర్జీ పల్లోంజీ గ్రూప్
ఢిల్లీలో నూతన పార్లమెంటు భవన నిర్మాణ పనులకు సంబంధించిన కాంట్రాక్టును దేశీయ దిగ్గజ కంపెనీ టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ దక్కించుకుంది. ఈ పార్లమెంటు బిడ్ను పొందే క్రమంలో టాటా సంస్థ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు షాపూర్జీ పల్లోంజీ గ్రూప్(SP) ఇటీవల ఆరోపించింది. అయితే తాజాగా, ఈ ఆరోపణలను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపింది. ప్రాజెక్టు బిడ్డింగ్ ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరగలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో SP గ్రూప్ తన ఆరోపణలను వెనక్కి తీసుకుంది.
టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సీఎల్.. భారీగా తగ్గిన హైరింగ్.. H2లో రికవరీ...
ఈ మేరకు కేంద్ర ప్రజా పనుల విభాగంకు (CPWD) SP గ్రూప్ లేఖ రాసింది. ఇక మీదట పార్లమెంటు భవనం కాంట్రాక్టుకు సంబంధించి ఎలాంటి ఆరోపణలు చేయమని స్పష్టం చేసింది. ఈ అంశంపై మీ ఆఫీస్ అంతర్గత సమీక్షను చేపట్టిందని, అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి, క్షుణ్ణంగా చర్చించి విశ్లేషించిందని అందుకు అభినందిస్తున్నామని పేర్కొంది. మొత్తం బిడ్డింగ్ ప్రక్రియ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరిగినట్లు వెల్లడించినందుకు అభినందిస్తున్నట్లు తెలిపింది.
ఢిల్లీలో నూతన పార్లమెంటు భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న భవనానికి సమీపంలో కొత్త భవనాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు 1400 మంది ఎంపీలు కూర్చుకునేందుకు కొత్త భవనం ఉండనుంది. దాదాపు రూ.860 కోట్లతో సెంట్రల్ విస్తా రీడెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా 22 నెలల వ్యవధిలో పార్లమెంట్ భవనాన్ని పూర్తి చేయాలని కేంద్రం నిర్ణయించింది.