Bengaluru News: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్.. కేఎస్ఆర్, యశ్వంతపూర్ రైల్వే స్టేషన్లలో ఆరు అదనపున ప్లాట్ఫారమ్స
బెంగళూరు వాసులకు నైరుతి రైల్వే శుభవార్త చెప్పింది. రద్దీగా ఉండే స్టేషన్ల బయట రైళ్లు నిలిచిపోయే సమస్యను తగ్గించడానికి, రైళ్ల రాకపోకలను మెరుగుపరచడానికి KSR బెంగళూరు సిటీ స్టేషన్లో రెండు, యశ్వంత్పూర్ స్టేషన్లో నాలుగు అదనపు ప్లాట్ఫారమ్లను ఏర్పాటు చేయాలని నైరుతి రైల్వే నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుల మొత్తం అంచనా వ్యయం రూ. 559.64 కోట్లుగా పేర్కొన్నారు.
ఈ విస్తరణతో KSR బెంగళూరులో ప్లాట్ఫారమ్ల సంఖ్య 10 నుంచి 12కి, యశ్వంత్పూర్లో 6 నుంచి 10కి పెరుగుతుంది. ఈ అదనపు సామర్థ్యం వల్ల రైళ్ల రాకపోకలను మరింత సమర్థవంతంగా నిర్వహించడం, రద్దీని తగ్గించడం, అన్ని ప్లాట్ఫారమ్లు నిండినప్పుడు రైళ్లు స్టేషన్ బయట వేచి ఉండాల్సిన పరిస్థితిని నివారించడం సాధ్యమవుతుందని రైల్వే అధికారులు పేర్కొంటున్నారు.
పెరుగుతున్న రైలు రద్దీ, పరిమిత స్టేషన్ సామర్థ్యం కారణంగా ప్రయాణికులు, రైల్వే అధికారులకు ప్లాట్ఫారమ్ లభ్యత ఒక ప్రధాన సమస్యగా మారిందని.. దీనిని పరిష్కరించడమే ఈ ప్రాజెక్టుల లక్ష్యమని తెలిపారు. KSR బెంగళూరులో నైరుతి రైల్వే ఆగస్టు మొదటి వారంలోనే యార్డ్ పునర్వ్యవస్థీకరణ మొదటి దశను పూర్తి చేసింది. ఈ పనుల వల్ల స్టేషన్ యార్డ్ పరిధిలో రైళ్ల కదలిక ఇప్పటికే మెరుగుపడిందని అధికారులు తెలిపారు. తదుపరి దశలో ప్లాట్ఫారమ్ సామర్థ్యాన్ని పెంచడంపై దృష్టి సారిస్తారు. KSR బెంగళూరులో రూ. 228 కోట్ల అంచనా వ్యయంతో రెండు అదనపు ప్లాట్ఫారమ్లను నిర్మించే ప్రతిపాదనకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది.

ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడానికి అవసరమైన సాంకేతిక ప్రక్రియలను అధికారులు ప్రారంభించారు. ఈ కొత్త ప్లాట్ఫారమ్లు మైసూరు, దక్షిణ కర్ణాటకలోని ఇతర ప్రాంతాలకు వెళ్లే రైళ్లు త్వరగా వెళ్లనున్నాయి. ప్రస్తుతం ఆరు ప్లాట్ఫారమ్లు ఉన్న యశ్వంత్పూర్ స్టేషన్లో రూ. 331.64 కోట్ల అంచనా వ్యయంతో నాలుగు కొత్త 'ఐలాండ్ ప్లాట్ఫారమ్లను నిర్మించనున్నారు. వీటిలో రెండు ప్లాట్ఫారమ్లు దాదాపు 390 మీటర్ల పొడవు ఉండి, ప్రధానంగా సబర్బన్, MEMU రైళ్లకు సేవలందిస్తాయి. మిగిలిన రెండు ప్లాట్ఫారమ్లు దాదాపు 600 మీటర్ల పొడవు ఉండి. మెయిన్లైన్ రైళ్లకు అనుకూలంగా ఉంటాయి. ప్లాట్ఫారమ్ల నిర్మాణానికి స్థలం కల్పించేందుకు యశ్వంత్పూర్లోని ట్రాక్ మెషిన్ డిపోను తరలించాలని నైరుతి రైల్వే యోచిస్తోంది.
ఈ భారీ ప్రాజెక్ట్ కోసం ప్రస్తుత రైల్వే మౌలిక సదుపాయాలలో మార్పులు చేయడం, కొన్ని నిర్మాణాలను తొలగించడం, స్టేషన్కు ఆనుకుని ఉన్న భూమిని సేకరించడం వంటివి అవసరమవుతాయి. అధికారులు సిబ్బంది నివాస గృహాలు, ఒక విద్యాసంస్థ, సమీపంలోని రైల్వే కాలనీలోని కొన్ని భాగాలను ఖాళీ చేయడం లేదా స్వాధీనం చేసుకోవడం గురించి పరిశీలిస్తున్నారు. ప్రతిపాదిత మౌలిక సదుపాయాల కోసం వారు దాదాపు 200 చెట్లను కూడా తొలగించాల్సి రావచ్చు. ఈ ప్లాట్ఫాం విస్తరణ ప్రస్తుతం కొనసాగుతున్న రూ. 377 కోట్ల యశ్వంత్పూర్ స్టేషన్ పునరాభివృద్ధికి తోడ్పాటునిస్తుంది.
ఈ ప్రాజెక్టులో కొత్త స్టేషన్ భవనం, ఎయిర్ కాన్కోర్స్, బహుళ అంతస్తుల పార్కింగ్, ప్రత్యేక ప్రవేశ, నిష్క్రమణ ఏర్పాట్లు చేస్తున్నారు. రైల్వే అధికారులు వందే భారత్ సేవల కోసం మౌలిక సదుపాయాలతో సహా, రైలు కార్యకలాపాలు, నిర్వహణ కోసం అదనపు సౌకర్యాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. 2022లో బైయప్పనహళ్లిలో సర్ ఎం విశ్వేశ్వరయ్య టెర్మినల్ ప్రారంభమై, ముఖ్యంగా ఉత్తర భారతదేశానికి వెళ్లే అనేక దూరప్రాంత రైళ్లను స్వాధీనం చేసుకున్నప్పటి నుండి కేఎస్ఆర్ బెంగళూరుపై ఒత్తిడి తగ్గింది. బెంగళూరు రైల్వే నెట్వర్క్ పెరుగుతున్న కొద్దీ, ప్లాట్ఫారాలు నిండిపోవడం వల్ల వచ్చే రైళ్లు తరచుగా స్టేషన్ల వెలుపల వేచి ఉండాల్సి వస్తోంది, ఇది ప్రయాణికులకు అసౌకర్యం కలిగించి, షెడ్యూళ్లకు అంతరాయం కలిగిస్తోంది. ప్రతిపాదించిన ఆరు ప్లాట్ఫారమ్లు, నగరంలోని అత్యంత రద్దీగా ఉండే రెండు రైల్వే కేంద్రాల వద్ద రైల్వే అధికారులకు మరింత సౌలభ్యాన్ని కల్పించి, కార్యకలాపాలను మెరుగుపరచడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications