Bengaluru News: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్.. త్వరలోనే బెంగళూరు, మంగళూరు మధ్య వందే భారత్..

బెంగళూరు వాసులకు సౌత్ వెస్ట్ రైల్వే(SWR) శుభవార్త చెప్పింది. బెంగళూరు, మంగళూరుల మధ్య 20 కోచ్‌ల వందే భారత్ రైలును త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించింది.
ఈ నెల చివరలో సకలేష్‌పూర్-సుబ్రహ్మణ్య రోడ్ సెక్షన్‌లో దీనికి సంబంధించిన ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ రైలును ఇటీవల మైసూరు రైల్వే డివిజన్‌కు అప్పగించారు. వారు ఆగస్టు 18 నుంచి 22 వరకు పశ్చిమ కనుమల సెక్షన్‌లో ట్రయల్ రన్ నిర్వహిస్తారు. నిటారుగా ఉండే వాలు ప్రాంతాలలో భద్రత కోసం ఈ రైలులో ఆటోమేటెడ్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ (AEB) వ్యవస్థలను అమర్చినట్లు, కర్ణాటకలో ఇదే మొదటిసారి అని సౌత్ వెస్ట్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ మంజునాథ్ కనమడి తెలిపారు.

ట్రయల్ రన్ ఫలితాల ఆధారంగా ఈ రెండు నగరాల మధ్య వందే భారత్ రైలును ఎప్పుడు ప్రవేశపెట్టాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. కొన్ని సాంకేతిక అడ్డంకులను తొలగించాల్సి రావడంతో, ఈ మార్గంలో ప్రీమియం రైలును నడపడానికి రైల్వే అధికారులు కొంత సమయం తీసుకున్నామని వివరించారు. 55 కిలోమీటర్ల సకలేష్‌పూర్-సుబ్రహ్మణ్య రోడ్ ఘాట్ విభాగం విద్యుదీకరణ 2025 డిసెంబర్ 28న పూర్తయింది. దీంతో బెంగళూరు-మంగళూరు మార్గంలో విద్యుత్ రైళ్ల కార్యకలాపాలకు మార్గం సుగమమైంది. ఈ ఘాట్ ప్రాంతం రైల్వే నెట్‌వర్క్‌లో అత్యంత కష్టతరమైన, సాంకేతికంగా సవాలుతో కూడిన విభాగాలలో ఒకటి.

Vande Bharat

ఇక్కడ రైల్వే ట్రాక్‌లకు చేరుకోవడానికి రహదారి సౌకర్యం లేదు. ఈ ట్రాక్‌లలో 1కి 50 నిష్పత్తిలో నిటారు వాలు, 57 సొరంగాలు, 226 వంతెనలు, 108 క్లిష్టమైన మలుపులు ఉన్నాయి. ఈ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంది. ఇటీవల కొండచరియలు విరిగిపడడం వల్ల డజన్ల కొద్దీ రైళ్లపై ప్రభావం చూపింది. మంగళూరు, మడ్గావ్ మధ్య ప్రస్తుతం నడుస్తున్న సర్వీసును (20645/20646) పొడిగించి, బెంగళూరు-మంగళూరు వందే భారత్‌ను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు రైల్వే వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ప్రణాళికలు కార్యరూపం దాల్చితే, రైలు ఉదయం బెంగళూరు నుంచి బయలుదేరి, మధ్యాహ్నం మంగళూరు చేరుకుని, సాయంత్రానికి మడ్గావ్ చేరుకుంటుంది.

మడ్గావ్ నుంచి బయలుదేరే రైలు కూడా ఉదయం బయలుదేరి, మధ్యాహ్నం మంగళూరుకు, సాయంత్రం బెంగళూరుకు చేరుకోవచ్చు. ఇందుకోసం రెండు వేర్వేరు రేక్‌లను ఉపయోగిస్తారని సౌత్ వెస్ట్ రైల్వే వర్గాలు చెబుతున్నాయి. బెంగళూరు, మంగళూరు మధ్య ప్రయాణ సమయం 7 గంటలు లేదా అంతకంటే తక్కువగా ఉంటుందని అంచనా. ఇది ప్రస్తుత అత్యంత వేగవంతమైన రైలు కంటే సుమారు గంట తక్కువని అధికారులు చెబుతున్నారు. మరో పక్క ముంబై నుంచి బెంగళూరుకు త్వరలో వందే భారత్ స్లీపర్ రైలు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి ట్రయల్స్ కూడా జరుగుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+