Rice News: కొన్ని నెలలుగా దేశంలోని సంక్లిష్ట వాతావరణం కారణంగా దిగుబడి తగ్గింది. దీంతో పప్పులు, కూరగాయల ధరలతో పాటు బియ్యం ధరలు సైతం కొండెక్కి కూర్చున్నాయి. దీంతో కేంద్రం ముందస్తుగా ఎగుమతులపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
దేశీయ మార్కెట్లో బాస్మతీయేతర బియ్యం ధరను అదుపు చేసేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ధరలను కనిష్ట స్థాయికి తగ్గించాలని ప్రభుత్వం బియ్యం పరిశ్రమల సంఘాలను ఆదేశించింది. బియ్యం ప్రాసెసింగ్ పరిశ్రమకు చెందిన ముఖ్య ప్రతినిధులతో ఆహార, ప్రజాపంపిణీ శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా సమావేశం నిర్వహించి ధరలు సజావుగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గత రెండేళ్లలో బియ్యం ధరలు ఏకంగా 12 శాతం పెరిగాయి.

మంచి పంట దిగుబడి, ఎగుమతి నిషేధం ఉన్నప్పటికీ బియ్యం ధరలు పెరగడానికి గల కారణాన్ని కూడా చర్చించారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సిఐ) రైస్ ప్రాసెసింగ్ పరిశ్రమకు నాణ్యమైన బియ్యం తగినంత స్టాక్ ఉందని తెలియజేసింది. ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్(OMSS) పద్ధతిలో కేజీ బియ్యం ధరను రూ.29కి విక్రయిస్తున్నారు. ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్ కింద, వ్యాపారులు ఎఫ్సిఐ నుంచి బియ్యాన్ని కొనుగోలు చేయవచ్చు. జూలై మాసంలో బియ్యం ఎగుమతులపై నిషేధం విధించినప్పటికీ ఆసియా, ఆఫ్రికాలోని వ్యూహాత్మక భాగస్వాములకు బియ్యాన్ని సరఫరా చేస్తోంది
ఇటీవలి నెలల్లో సింగపూర్, నేపాల్, మలేషియా, ఫిలిప్పీన్స్తో సహా 14 ప్రధాన ఆసియా, ఆఫ్రికన్ దేశాలకు 2.77 మిలియన్ టన్నుల బాస్మతీయేతర తెల్ల బియ్యాన్ని ఎగుమతి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఇదిలా ఉండగా పప్పు దినుసుల లభ్యత మెరుగుపడడంతో పాటు వాటికి మార్కెట్లో డిమాండ్ తగ్గటం వల్ల వీటి ధరలు ఫిబ్రవరి నాటికి 18 శాతానికిపైగా తగ్గుతాయని అంచనా వేయబడింది. వాస్తవానికి గత ఏడాది ఉత్పత్తి తగ్గటం పెరుగుదలకు ప్రధాన కారణంగా ఉంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications