PM Kisan: రైతులకు శుభవార్త.. రెండు వారాల్లో పీఎం కిసాన్ డబ్బులు జమా అయ్యే అవకాశం..
అన్నదాతలను ఆదుకునేందుకు నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2019లో పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకం తీసుకొచ్చింది. ఈ పథకం కింది ప్రతి సంవత్సరం రైతులకు రూ.6 వేలను బ్యాంక్ అకౌంట్లో జమా చేస్తారు. మూడు విడతల్లో అంటే నాలుగు నెలలకు ఒక్కసారి రూ.2 వేల చొప్పున అన్నదాతల ఖాతాల్లో జమా చేస్తారు.
ఈకేవైసీ ఉంటనే
ఇప్పటికే 11 విడతలుగా రైతుల ఖాతాల్లో డబ్బు జమా అయింది. త్వరలో 12 విడత డబ్బులు వేయనున్నారు. 12 విడత డబ్బులు మరో రెండు వారాల్లో రైతుల ఖాతాల్లో జమయ్యే అవకాశం ఉంది. దీనిపై కేంద్ర అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఈకేవైసీ చేసుకున్న వారికే 12 విడత డబ్బులు వస్తాయని కేంద్రం స్పష్టం చేసింది.
సెప్టెంబర్ 30
ఈకేవైసీ చేసుకోవడానిక సెప్టెంబర్ 30 వరకు గడవు పొడగించింది. ఆ లోపు ఈకేవైసీ చేసుకున్న వారికే 12 విడత డబ్బులు ఖాతాల్లో జమా కానున్నాయి. ఈకేవైసీ చేసుకోవాలంటే మీ మొబైల్ నెంబర్ ఆధార్ తో లింక్ అయి ఉండాలి. ఒకవేళ లింక్ కాకుంటే వెంటనే మీ దగ్గరలోని మీ సేవ సెంటర్ కు వెళ్లి మీ ఫోన్ నెంబర్ ను ఆధార్ లింకే చేసుకోవాలి.
ఈకేవైసీ ఎలా చేసుకోవాలంటే..
Step 1: ముందుగా అధికారిక వెబ్ సైట్ pmkisan.nic.in కి లాగిన్ అవ్వాలి.
Step 2: అందులో Farmers Corner కింద ఉన్న eKYC ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి.
Step 3: OTP ఆధారిత eKYC కోసం మీ ఆధార్ నంబర్ అందించండి.
Step 4: ఆ తరువాత సెర్చ్ ఆఫ్షన్ పై క్లిక్ చేయాలి.
Step 5: ఆ తరువాత ఆధార్ లింక్ చేయబడిన మెుబైల్ నంబర్ ఎంటర్ చేసి.. Get OTP ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 6: ఆ తరువాత మీ మెుబైల్ కు వచ్చిన ఓటీపీ నంబర్ ఎంటర్ చేయండి.
Step 7: అందించిన వివరాలు పూర్తిగా వెరిఫికేషన్ అయ్యాక eKYC ప్రక్రియ పూర్తవుతుంది.
టోల్ ఫ్రీ నెంబర్ 155261
కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారు దరఖాస్తు స్టేటస్ తెలుసుకోవడంలో ఏదైనా సమస్య ఉంటే 155261 అనే టోల్ ఫ్రీ నెంబర్కు కూడా మీరు కాల్ చేయొచ్చని కేంద్రం తెలిపింది. అంతే కాకుండా మీరు మీ 12వ విడతకు సంబంధించిన డబ్బులు పడతాయో లేదో తెలుసుకోవచ్చట.