రోబోల ద్వారా స్నాప్డీల్ డెలివరీ, ఆ కంపెనీతో భాగస్వామ్యం
ఈ-కామర్స్ కంపెనీ స్నాప్డీల్ తాజాగా ఆటానమస్ మొబిలిటీ స్టార్టప్ ఒట్టోనోమీ ఐవోతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే ఆన్లైన్ ద్వారా ఆర్డర్ ఇచ్చిన ఉత్పత్తుల సరఫరా కోసం అమెజాన్, ఫ్లిప్కార్ట్ డ్రోన్లను వినియోగించే ప్రయత్నాలు చేస్తున్నాయి. స్నాప్డీల్ రోబోల ద్వారా సరఫరా చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఇందుకోసమే ఒటటోనోమీ ఐవోతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
రూ.1,240 కోట్లతో విశాఖలో జపాన్ కంపెనీ ఆఫ్-హైవే టైర్ల ప్లాంట్, 600 కొత్త ఉద్యోగాలు
ఢిల్లీ-ఎన్సీఆర్ వంటి ఎంపిక చేసిన ప్రాంతాల్లో రోబోల ద్వారా సరుకు సరఫరాను విజయవంతంగా పరీక్షించింది. గృహనివాస సముదాయాల ముంగిట ఈ రోబోలను ఉంచుతారు. సరఫరా ఏజెంట్ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి, రోబో లోపల ప్యాకేజీని ఉంచుతారు. అప్పటికే సొసైటీ మ్యాప్ అందులో నిక్షిప్తం చేయడంతో దాని ఆధారంగా వినియోగదారు వద్దకు రోబో చేరుకొని, సరకు సరఫరా చేస్తుంది.
ఒట్టోనోమీ ఐవో డెలివరీ రోబోలను డెవలప్ చేసింది. ఈ రోబోలు స్థానిక వీధుల్లో సైడ్ వాక్స్ నుండి రన్ చేస్తాయి. గుంపులుగా ఉండే ప్రాంతాల్లో ఏఐ అల్గారిథమ్ నావిగేట్ చేస్తుంది. ఈ రోబోలు మిషన్ లెర్నింగ్ను ఉపయోగిస్తారు. బాహ్య ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఈ రోబోలకు మిషన్ లెర్నింగ్, 3డీ లిడార్, కెమెరాల నుండి ఫ్యూజ్ డేటా వినియోగిస్తాయి.
భవిష్యత్తు కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ పైన భారీగా పెట్టుబడులు పెడుతున్నామని స్నాప్డీల్ అధికార ప్రతినిధి తెలిపారు. రోబోట్ల ద్వారా డెలివరీ అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ టెక్నాలజీని పరీక్షించడం కోసం ఒట్టోనోమీ ఐవోతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు తెలిపారు.