దేశంలో అమ్ముడవుతున్న వస్తుసేవలపై ప్రభుత్వం పన్ను విదిస్తుంది. ఈ పన్ను ఒక్కో దానిపై ఒక్కో విధంగా ఉంటుంది. పన్ను ద్వారా సమకూరే రాబడిని ప్రభుత్వం అభివృద్ధి కోసం, ప్రజల కోసం ఖర్చు చేస్తుంది. అయితే వస్తుసేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి వచ్చిన తర్వాత కొన్నింటి పై పన్నులు పెరిగాయి. ఈ పన్నును చెల్లించకుండా ఉండటానికి అనేక మంది అనేక దొడ్డి దారులు వెతుకుతున్నారు. పన్నులు ఎగవేయడం వల్ల ప్రభుత్వ ఖజానాకు వచ్చే సొమ్ము తగ్గిపోతోంది.

విస్తరిస్తున్న స్మగ్లింగ్ వ్యాపారం...
* విదేశాల్లో కొన్ని ఉత్పత్తులు తక్కువ ధరకు దొరుకుతాయి. అవే ఉత్పత్తులకు మన దేశంలో ఎక్కువ ధర ఉంటుంది. ఇలాంటి ఉత్పత్తులను విదేశాలనుంచి దొడ్డిదారి గుండా మనదేశంలోకి వచ్చి కాస్త తక్కువ మొత్తానికి అమ్ముతుంటారు. విదేశాల నుంచి తెచ్చినప్పుడు వాటికి కస్టమ్స్ సుంకం చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని ఎగవేసేందుకు చాలా మంది స్మగ్లింగ్ కు పాల్పడుతున్నారు. ఇలా బంగారాన్ని తెస్తూ చాలా మంది దొరికి పోతున్నారు...
* అయితే ఇప్పుడు ఈ దందా ప్రీమియం స్మార్ట్ ఫోన్లకు పాకుతోంది. యాపిల్, శాంసంగ్, ఇతర కంపెనీలకు చెందిన ప్రీమియం ఫోన్లలో ఈ దందా సాగుతోంది. ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు వార్షికంగా 2,400 కోట్ల మేరకు గండి పడుతోందట. 50,000 రూపాయలకు మించిన ధర కలిగిన ఫోన్ల ను లక్ష్యంగా చేసుకొనే ఈ వ్యవహారం
* కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు కు ఇండియన్ సెల్యూలార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ అందజేసిన సమాచారం ప్రకారం అనధికారిక మార్కెట్ 15,000 కోట్ల రూపాయల వరకు ఉంటుందట. ఇందులో 8,000 కోట్ల రూపాయల వరకు మొబైల్ ఫోన్ విభాగం ఉంటుందట. మొబైల్ ఫోన్ల మొత్తం అమ్మకాల్లో దీని వాటా 7.2 శాతం ఉంటుందని సమాచారం. ఈ స్థాయిలో స్మగ్లింగ్ జరగడం వల్ల ప్రభుత్వం వార్షికంగా 2,400 కోట్ల రూపాయల రాబడిని కోల్పోతోందని చెబుతున్నారు. వస్తుసేవల పన్నుతో పాటు కస్టమ్ సుంకం చెల్లించక పోవడం వల్ల ఈ మేరకు నష్టం వాటిల్లుతోందని సమాచారం.

సుంకాలు ఎందుకంటే...
* మేక్ ఇన్ ఇండియాకు మన ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రాధాన్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే విదేశాల నుంచి మన దేశానికి వచ్చే అనేక రకాల ఉత్పత్తులపై పన్నులు విధిస్తోంది. దీని వల్ల దిగుమతి చేసుకున్న ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి. అప్పుడు వినియోగదారులు దేశీయంగానే ఉత్పత్తి అవుతున్న ఉత్పత్తులను కొనుగోలు చేస్తుంటారు. అయితే విదేశాలనుంచి పన్నులు చెల్లించకుండా తీసుకువచ్చే వాటి ధర తక్కువగా ఉంటుంది. ఇలాంటి వాటిని కొనే వారు పెరుగుతుండటం వల్లనే దొడ్డిదారిలో మన దేశంలోని మొబైల్ ఫోన్లు వంటివి వస్తున్నాయి.

సులభంగా తీసుకురావచ్చు...
* ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు లేదా పెద్ద పరిమాణంలో ఉండే ఉత్పత్తులు స్మగ్లింగ్ చేయడం కష్టమని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అయితే మొబైల్ ఫోన్లు వంటి వాటిని సులభంగా విదేశాల నుంచి తీసుకు రావొచ్చని అందుకే వీటిని మార్కెట్లోకి ఎక్కువగా తెస్తున్నారని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. విదేశాల నుంచి తెచ్చిన ఫోన్లు మనదేశంలో తక్కువ ధరకు అమ్ముతున్నారని, వీటిని కొనుగోలు చేసేందుకు కొంత మంది ప్రాధాన్యం ఇస్తున్నారని అంటున్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications