For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

iQOO సరికొత్త 5G మొబైల్, IPL టార్గెట్: కోహ్లీ బ్రాండ్ అంబాసిడర్

|

చైనీస్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ iQOO ోబుధవారం కీలక ప్రకటన చేసింది. క్రికెట్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లీని తమ కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించినట్లు తెలిపింది. క్రికెటర్లలో కోహ్లీ, ధోనీ, సచిన్, రోహిత్ శర్మ, సినిమా తారల్లో అక్షయ్ కుమార్, అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్, షారూక్ ఖాన్ తదితరులకు మంచి డిమాండ్ ఉంది. పదుల కొద్ది బ్రాండ్లకు వీరు అంబాసిడర్‌గా ఉన్నారు. వీరందరిలోకెల్లా కోహ్లీ మండి డిమాండ్‌లో ఉన్నారు.

చైనా కీలక వాణిజ్య భాగస్వామి, భారత్‌పై కరోనా వైరస్ ప్రభావం ఎంతంటే?చైనా కీలక వాణిజ్య భాగస్వామి, భారత్‌పై కరోనా వైరస్ ప్రభావం ఎంతంటే?

యువతకు చేరువయ్యేలా కోహ్లీ

యువతకు చేరువయ్యేలా కోహ్లీ

చైనాలో వివోకు iQOO సబ్ బ్రాండ్‌గా ఉంది. ఇప్పుడు ఇది భారత్‌లోకి ప్రత్యేకంగా ఎంటర్ అవుతోంది. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించింది. తమ కంపెనీకి యువతను చేరువ చేసేందుకు కోహ్లీ నియామకం ఉపయోగపడుతుందని తెలిపింది.

కోహ్లీ సరిగ్గా సరిపోతాడు

కోహ్లీ సరిగ్గా సరిపోతాడు

తమ కంపెనీకి విరాట్ కోహ్లీ సరిపోతాడని కంపెనీ డైరెక్టర్ (మార్కెటింగ్) గగన్ అరోరా అన్నారు. అతను తమతో కలిసి పని చేయడం పట్ల సంతోషంగా ఉన్నామని చెప్పారు. ప్రీమియం విభాగంలో హై పర్ఫార్మెన్స్, ఆవిష్కరణ, భిన్నమైన ఉత్పత్తులను తాము విరాట్ కోహ్లీ ద్వారా ప్రచారం చేస్తామన్నారు.

టార్గెట్ ఐపీఎల్..

టార్గెట్ ఐపీఎల్..

ఆధునాతన ఫీచర్లతో కూడిన స్మార్ట్ ఫోన్స్ ద్వారా మొబైల్ మార్కెట్లో iQOO మంచి పేరు సంపాదించుకుందని విరాట్ కోహ్లీ అన్నారు. కాగా, ఇప్పటికే ఈ కంపెనీ విడుదల చేసిన టీజర్‌లలో కోహ్లీ కనిపిస్తున్నారు. పూర్తి ప్రచారం స్మార్ట్ ఫోన్ మోడల్ iQOO 3ని ఫిబ్రవరి 25న లాంచ్ చేసిన సమయంలో ప్రారంభమవుతుంది. ఐపీఎల్ సీజన్‌లో ఈ ప్రకటనలు మన ముందుకు ఆకర్షణీయంగా రానున్నాయి.

25న 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్

25న 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్

భారత్‌లోకి ప్రత్యేకంగా అడుగు పెడుతోన్న iQOO ఫిబ్రవరి 25న 5G స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. ఇది అభివృద్ధి చెందుతున్న ప్రీమియం స్మార్ట్ ఫోన్‌ల మార్కెట్లో పోటీ పడనుంది. తొలుత ఐ క్వెస్ట్ ఆన్ అండ్ ఆన్ ద్వారా ఆన్ లైన్ సేల్స్ ప్రారంభిస్తుంది. ఆ తర్వాత ఆఫ్‌లైన్ రిటైల్‌లోకి అడుగు పెట్టే ప్రయత్నం చేయనుంది.

పది లక్షల ఫోన్ల విక్రయం టార్గెట్

పది లక్షల ఫోన్ల విక్రయం టార్గెట్

రానున్న ఏడాదిలో 10 లక్షల ఫోన్లను విక్రయించాలని భావిస్తోంది. బీబీకే గ్రూప్ నుంచి ఐక్యూ ఐదో సంస్థగా భారత్‌లో అడుగు పెడుతోంది. ఇప్పటికే ఈ మాతృ సంస్థ నుంచి వన్ ప్లస్, వివో, ఒప్పో, రియల్ మి బ్రాండ్స్ వచ్చాయి.

English summary

iQOO సరికొత్త 5G మొబైల్, IPL టార్గెట్: కోహ్లీ బ్రాండ్ అంబాసిడర్ | Smartphone brand iQOO appoints Virat Kohli as brand ambassador

Chinese smartphone brand iQOO on Wednesday announced the appointment of Indian cricket team captain Virat Kohli as its new brand ambassador.
Story first published: Thursday, February 20, 2020, 11:40 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X