నిత్యావసర వస్తువుల ధరలు నింగిని తాకాయి. కరోనాకు వరదలు కూడా తోడై ఆహార ధాన్యాల , నిత్యావసరాల ఉత్పత్తి పడిపోవడంతో విపరీతంగా పెరిగిన ధరలు సామాన్యులకు దడ పుట్టిస్తున్నాయి. సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు అంటూ ప్రస్తుత పరిస్థితికి లబోదిబోమంటున్నారు. పనుల్లేక పేద, మధ్య తరగతి వర్గాల ఆదాయం పడిపోతూ ఉంటే నిత్యావసర వస్తువుల ధరలు మాత్రం జెట్ స్పీడ్ తో పైకి దూసుకుపోతున్నాయి.

విపరీతంగా పెరిగిన ధరలు ... కరోనా , వరదలు కారణం
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది నూనెల ధరలు 25 శాతం పెరగగా, పప్పుల ధరలు, చింతపండు ధరలు కొనలేనంతగా పెరిగాయి. కరోనా లాక్డౌన్ ప్రభావంతో విదేశాల నుండి దిగుమతి చేసుకునే సరుకుల నిల్వలు భారీగా తగ్గిపోయాయి. ఇక మన దేశంలో ఉత్పత్తి అయ్యే చాలావరకూ పప్పు ధాన్యాలు, ఉల్లిగడ్డలు, కూరగాయలు కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ ప్రభావం తోనూ, ఆ తర్వాత కురిసిన భారీ వర్షాల కారణంగానూ, ప్రస్తుతం నివర్ తుఫాన్ కారణంగానూ దెబ్బతిన్నాయి.

కరోనా లాక్ డౌన్ ఎఫెక్ట్ .. ఇప్పుడు వరదల ప్రభావంతో ఉత్పత్తికి దెబ్బ
కరోనా సమయంలో రవాణా ఇబ్బందులతో నష్టపోయిన రైతులు ఖరీఫ్ లో కొత్తగా కూరగాయల పంటలు వేయకపోవడం , ఇక పంటలు వేసిన ప్రాంతాలలో భారీ వర్షాలు కురవడం వల్ల నీట మునిగిన పంట కుళ్ళిపోవడం వంటి కారణాలతో కూరగాయల ధరలు గతంతో పోలిస్తే చాలా పెరిగిపోయాయి. పప్పుల ధరలు చూస్తే దేశీయంగా ఉత్పత్తి తగ్గిపోవడం, ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవడానికి అవకాశం లేకపోవడం వంటి కారణాలతో పప్పుల ధరలకు రెక్కలొచ్చాయి.

ఉల్లి ధరలు పెరగటానికి అనేక కారణాలు
ఉల్లిగడ్డలను చూస్తే కిలోకు వంద రూపాయల నుండి 120 రూపాయల ధర పలుకుతోంది కరోనా లాక్డౌన్ ప్రభావంతో రవాణా లేక ఉల్లిగడ్డలు పంట పొలాల్లోనే పాడైపోవడం, ఇప్పుడు తాజాగా కొత్త పంట రాకపోవడం, ఇతర దేశాల నుండి ఉల్లి దిగుమతులను పెద్దగా చేసుకోకపోవడం వంటి కారణాలు కూడా ఉల్లిపాయ ధరలకు రెక్కలు రావడానికి కారణమైంది. ఇక నూనెల ధరలు చూస్తే వేరుశెనగ నూనె మూడేళ్ల కిందట ధరలను బట్టి చూస్తే ఏకంగా 50 శాతం పెరిగినట్లు గా తెలుస్తోంది.

ధరాఘాతం శరాఘాతంగా ... చుక్కలు తాకిన నిత్యావసరాలు
దీంతో సామాన్యుల పాలిట ధరాఘాతం శరాఘాతంగా మారుతుంది. ఒకపక్క పని లేక, మరోపక్క కరోనా మహమ్మారి దాడి, ఇంకోపక్క నింగిని తాకిన, చుక్కలనంటిన నిత్యావసర వస్తువుల ధరలు వెరసి సామాన్యులు బ్రతక లేని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితులపై దృష్టి సారించి సామాన్యులకు అందుబాటులో ఉండేవిధంగా ధరలను నియంత్రించాలని ప్రభుత్వ యంత్రాంగం చూసి చూడనట్టు వ్యవహరిస్తోంది. వంటింటి సరుకులు అన్నీ ప్రియం కావడంతో పేద మధ్యతరగతి ప్రజలపై పెను ప్రభావం పడుతోంది.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications