5 రోజుల్లో.. టాప్ 10లో 6 కంపెనీల వ్యాల్యూ రూ.1లక్ష కోట్లు పెరిగింది, రిలయన్స్ దూకుడు
ముంబై: గత వారం టాప్ 10 కంపెనీల్లో ఆరు రూ.1 లక్ష కోట్లకు పైగా మార్కెట్ క్యాపిటలైజేషన్ను పెంచుకోగా, నాలుగు కంపెనీలు నష్టపోయాయి. ఎం-క్యాప్ పరంగా భారీగా లాభపడిన వాటిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ముందంజలో ఉంది. RIL, TCS, HDFC బ్యాంకు, హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్ (HUL), ఇన్ఫోసిస్, HDFC మార్కెట్ వ్యాల్యూ పెరగగా, భారతీ ఎయిర్టెల్, కొటక్ మహీంద్రా బ్యాంకు, ITC, ICICI బ్యాంకు నష్టాల్లో ముగిశాయి.
టాటా మోటార్స్ బంపరాఫర్, 6నెలలు ఈఎంఐ లేకుండా కారు కొనొచ్చు
రిలయన్స్ టాప్ గెయినర్
టాప్ 10లోని 6 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గత వారం రూ.1,03,625.35 కోట్లు పెరిగింది. బీఎస్ఈ సెన్సెక్స్ 572.91 పాయింట్లు లేదా 1.59% పెరిగింది.
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎం-క్యాప్ రూ.57,688 కోట్లు పెరిగి రూ.11,90,857.13 కోట్లకు చేరుకుంది.
హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఎం-క్యాప్ రూ.17,102.22 కోట్లు ఎగిసి రూ.6,06,867.94 కోట్లకు,
హెచ్యూఎల్ ఎం-క్యాప్ రూ.12,088.43 పెరిగి రూ.5,22,481.19 కోట్లకు,
టీసీఎస్ ఎం-క్యాప్ రూ.8,499.15 ఎగిసి రూ.8,33,648.55 కోట్లకు,
ఇన్ఫోసిస్ ఎం-క్యాప్ 8,177.58 ఎగిసి రూ.3,32,980.71 కోట్లకు,
హెచ్డీఎఫ్సీ ఎం-క్యాప్ 69.39 పెరిగి రూ.3,27,189.91 కోట్లకు చేరుకుంది.
నష్టపోయిన 4 కంపెనీలివే
ఐటీసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.16,041.36 కోట్లు తగ్గి రూ.2,38,838.05 కోట్లకు,
భారతీ ఎయిర్టెల్ ఎం-క్యాప్ 3,491.56 కోట్లు పడిపోయి రూ.3,13,530.88 కోట్లకు,
కొటక్ మహీంద్రా బ్యాంకు ఎం-క్యాప్ రూ.791.52 తగ్గి రూ.2,67,039.65 కోట్లకు,
ఐసీఐసీఐ బ్యాంకు ఎం-క్యాప్ రూ.420.94 కోట్లు పడిపోయి రూ.2,33,361.95 కోట్లకు తగ్గింది.
రిలయన్స్ జూమ్
కరోనా కష్టకాలంలోనూ జియో ప్లాట్ఫాంలోకి పెట్టుబడుల వెల్లువ కారణంగా రిలయన్స్ షేర్లు దూసుకెళ్తున్నాయి. శుక్రవారం ఒక్కరోజే 3 శాతం పెరిగి రూ.34,195.13 కోట్లను మార్కెట్ క్యాపిటలైజేషన్కు యాడ్ చేసింది. దీంతో రిలయన్స్ వ్యాల్యూ రూ.11,90,857.13 కోట్లకు చేరుకుంది. ఓ సమయంలో 3.27 శాతం పెరిగి షేర్ వ్యాల్యూ రూ.1,884.40 కోట్లకు చేరుకుంది.