Yes Bank News: ఏటీఎంల వద్ద డిపాజిటర్లు బారులు, నిర్మలా సీతారామన్ హామీ

యస్ బ్యాంకు డిపాజిటర్లకు ఎలాంటి నష్టం జరగబోదని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం హామీ ఇచ్చారు. యస్ బ్యాంకుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విధించిన మారటోరియం వల్ల ఏ ఒక్క డిపాజిటర్‌కు కూడా ఇబ్బందులు తలెత్తవన్నారు. ఆర్బీఐ గవర్నర్ కూడా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. మీ డబ్బు సురక్షితంగా ఉంటుందన్నారు.

యస్ బ్యాంకుపై ఆర్బీఐ గురువారం మారటోరియం విధించిన విషయం తెలిసిందే. ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఆ బ్యాంకు ఖాతాదారులు డబ్బు విత్ డ్రా కోసం ఏటీఎంల ముందు వరుస కట్టారు. యస్ బ్యాంకు ఖాతాదారులెవరూ తమ ఖాతాల నుంచి నెలకు రూ.50,000కు మించి విత్ డ్రా చేసుకునేందుకు వీలు లేదని ఆర్బీఐ పరిమితి విధించింది. తదుపరి ప్రకటన వెలువడే వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని తెలిపింది.

Sitharaman reassures depositors, says there will be no loss to them

ఆర్బీఐ ఆదేశాలతో డిపాజిటర్లు ఆందోళనకు గురయ్యారు. విత్ డ్రా కోసం ఏటీఎంల వద్ద క్యూ కట్టారు. ఏటీఎంలో రాకుంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా డబ్బును ఆన్‌లైన్ ద్వారా పంపించుకోవడం కూడా సాధ్యం కాలేదు. దీంతో ముంబైతో పాటు పలు నగరాల్లోని యస్ బ్యాంకు ఏటీఎంలు మూతపడ్డాయి. ముంబైలోని చెంబూర్ సబర్బన్ రెసిడెన్షియల్ ప్రాంతంలో యస్ బ్యాంకు ఏటీఎం ముందు జనం డబ్బు విత్ డ్రా కోసం బారులు తీరారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+