డిసెంబర్ 23న Silver ధరలు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సుకు 72 డాలర్ల మార్కును దాటడం ద్వారా మరో చరిత్రాత్మక ఘట్టాన్ని నమోదు చేశాయి. ఈ ఏడాది మొత్తం వెండి ప్రదర్శన పెట్టుబడిదారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 2025 సంవత్సరం ప్రారంభం నుంచి ఇప్పటివరకు దాదాపు 140 శాతం లాభాలతో వెండి, ఈక్విటీలు, బాండ్లు, ఇతర కమోడిటీల కంటే మెరుగైన పనితీరును కనబరిచింది. ఈ బలమైన ర్యాలీ కారణంగా రిటైల్ పెట్టుబడిదారులతో పాటు సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి కూడా వెండిపై కొత్త ఆసక్తి పెరుగుతోంది.
ఈ పరిణామాల మధ్య.. ఫియాట్ కరెన్సీలపై తన ఘాటైన విమర్శలతో పేరుగాంచిన 'రిచ్ డ్యాడ్ పూర్ డ్యాడ్' రచయిత రాబర్ట్ కియోసాకి వెండి ర్యాలీపై కీలక వ్యాఖ్యలు చేశారు. పారిశ్రామిక డిమాండ్ పెరుగుదల, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, ద్రవ్యోల్బణ భయాలు, సురక్షిత పెట్టుబడుల వైపు పెట్టుబడిదారుల మళ్లింపు వంటి అంశాల సమ్మేళనం వల్ల వెండి ధరలు వేగంగా ఎగబాకుతున్నాయని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నట్లుగా తెలిపారు.

సోషల్ మీడియా ప్లాట్ఫామ్ Xలో చేసిన ఒక పోస్ట్లో కియోసాకి.. వెండి $70 స్థాయిని దాటడం బంగారం, వెండి నిల్వ చేసేవారికి గొప్ప వార్త అయితే, ఫియాట్ కరెన్సీల్లో పొదుపు చేసే వారికి మాత్రం చెడ్డ వార్త అని వ్యాఖ్యానించారు. అధిక ద్రవ్యోల్బణం కొనసాగుతుండటంతో పాటు అమెరికన్ డాలర్ కొనుగోలు శక్తి క్రమంగా తగ్గిపోతున్న నేపథ్యంలో, వెండి వంటి హార్డ్ అసెట్స్ విలువ భారీగా పెరిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇదే సందర్భంలో 2026 నాటికి వెండి ధర ఔన్సుకు 200 డాలర్ల స్థాయికి చేరవచ్చని కియోసాకి సంచలన అంచనా వేశారు. పెట్టుబడిదారులను హెచ్చరిస్తూ.. ఫియాట్ కరెన్సీల విలువ ఎలా క్షీణిస్తుందో గమనించాలని సూచించారు. 2023లోనే వెండి ధర 68 డాలర్లకు చేరుతుందని ఆయన అంచనా వేయగా.. అప్పట్లో చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే తాజా ర్యాలీతో ఆయన అంచనాలు నిజమవుతున్నాయనే భావన కొందరిలో బలపడింది.
కియోసాకి పోస్ట్కు Xలో అనేక మంది ఆయనకు మద్దతు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా సమకాలీనంగా ద్రవ్య సరఫరా పెరుగుతుండటం, నిజ వడ్డీ రేట్లు తగ్గుముఖం పట్టడం వంటి పరిస్థితుల్లో వెండి వంటి కమోడిటీలు విలువ నిల్వగా మరింత ప్రాధాన్యం పొందుతున్నాయని కొందరు అభిప్రాయపడ్డారు. ఈసారి వెండి ర్యాలీ గత చక్రాల కంటే భిన్నమై, సంస్థాగత ఆస్తిగా మారుతున్న దశలో ఉందని మరికొందరు వ్యాఖ్యానించారు.ఇదే సమయంలో.. ఈ ఏడాది వెండి ర్యాలీకి పారిశ్రామిక బూమ్తో పాటు సురక్షిత స్వర్గధామ పెట్టుబడుల ప్రవాహాలు ప్రధాన కారణాలని విశ్లేషకులు చెబుతున్నారు. ధరలు మరింత ఎగబాకే కొద్దీ అస్థిరత కూడా కొనసాగవచ్చని హెచ్చరిస్తున్నారు.
యా వెల్త్ గ్లోబల్ రీసెర్చ్ డైరెక్టర్ అనుజ్ గుప్తా కూడా వెండిపై బుల్లిష్ మీద ఇదే దృక్పథాన్ని వ్యక్తం చేశారు. పెట్టుబడి డిమాండ్తో పాటు భౌతిక పారిశ్రామిక వినియోగం కారణంగా ఈ ఏడాది వెండి ధరలు 150 శాతం పైగా పెరిగాయని ఆయన తెలిపారు. అమెరికా ప్రభుత్వం అరుదైన ఖనిజాల విభాగంలో వెండిని చేర్చడం వల్ల భవిష్యత్తులో డిమాండ్ మరింత పెరిగే అవకాశముందని పేర్కొన్నారు. ఆయన అంచనాల ప్రకారం.. 2026లో వెండి ధరలు 80 డాలర్ల నుంచి 100 డాలర్ల మధ్య స్థాయిలను పరీక్షించవచ్చని తెలిపారు.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications