ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకమైన ఆస్తులలో వెండి ఒకటిగా మారింది. స్టాక్స్, బాండ్లు లాంటి ఆస్తుల మాదిరిగా నేరుగా ఆదాయం ఇవ్వకపోయినా, వెండి పెరుగుతున్న పారిశ్రామిక వినియోగం కారణంగా ఇప్పుడు మూడవ అతిపెద్ద గ్లోబల్ ఆస్తిగా గుర్తింపు పొందుతోంది. సాంకేతిక విప్లవం వేగంగా సాగుతున్న నేపథ్యంలో, వెండి ప్రాముఖ్యత బంగారాన్ని కూడా మించి పోతున్న పరిస్థితి కనిపిస్తోంది.
సౌర విద్యుత్ ప్యానెల్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, AI చిప్లు, డేటా సెంటర్లు, స్మార్ట్ఫోన్లు, వైద్య పరికరాలు వంటి అనేక కీలక రంగాల్లో వెండి కీలక పాత్ర పోషిస్తోంది. ఈ కారణంగానే చైనా, అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలు వెండిని క్రిటికల్ మినరల్ గా ప్రకటించి, వ్యూహాత్మక నిల్వలను పెంచడం ప్రారంభించాయి. ఇంతకాలం వరకు బంగారం మాత్రమే కీలక లోహంగా భావించబడితే, 2025లో వెండి ఆ స్థానాన్ని ఆక్రమించింది.

పెట్టుబడుల పరంగా చూస్తే, వెండి ఈ ఏడాది అసాధారణమైన ర్యాలీని నమోదు చేసింది. పెట్టుబడిదారులకు 190 శాతం కంటే ఎక్కువ లాభాన్ని ఇచ్చింది. భారత రిటైల్ మార్కెట్లో జనవరి 1న కిలో వెండి ధర రూ.98 వేలుగా ఉండగా.. ఇప్పుడు అది రూ.2.85 లక్షలకు చేరుకుంది. కేవలం ఒక ఏడాదిలో మూడు రెట్లు పెరగడం వల్ల వెండి ధరలు క్రిప్టోకరెన్సీ లాంటి తీవ్ర అస్థిరతను చూపుతున్నాయి. అందుకే ఇప్పుడు వెండిని మెటల్ విత్ క్రిప్టో రిస్క్ ప్రొఫైల్ గా కొందరు విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.
వెండి ధరల పెరుగుదల ప్రభావం పెట్టుబడిదారులకే పరిమితం కాదు. సామాన్య ప్రజల జీవితాలపై కూడా ఇది ప్రభావం చూపుతుంది. వెండి ధరలు పెరిగితే, సౌర ప్యానెల్లు, ఎలక్ట్రిక్ కార్లు, ఎలక్ట్రానిక్స్ వంటి ఉత్పత్తుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో ద్రవ్యోల్బణ ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉంది.
1979-80లో వెండి ధరలు అతి వేగంగా పెరిగి, కొన్ని నెలల్లోనే 90 శాతం కంటే ఎక్కువగా పడిపోయాయి. 2011లో కూడా ఇదే పరిస్థితి జరిగింది. 48 డాలర్లని తాకిన వెండి ధరలు ఆ తర్వాత 75 శాతం కంటే ఎక్కువగా క్షీణించాయి. ఈ రెండు సందర్భాల్లోనూ, ధరలు గరిష్ట స్థాయికి చేరిన తర్వాత తీవ్ర పతనం చోటు చేసుకుంది. కరోనా కాలంలో కనిష్ట స్థాయి నుంచి ఇప్పటివరకు వెండి ధరలు ఆరు రెట్లు పెరిగాయి. కేవలం గత ఏడాదిలోనే మూడు రెట్లు పెరగడం మార్కెట్లో ఆందోళనను కలిగిస్తోంది. అయితే 1979 లేదా 2011తో పోలిస్తే ఈసారి పారిశ్రామిక డిమాండ్ మరింత బలంగా ఉందని నిపుణులు చెబుతున్నారు.
ICICI ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ స్థిర ఆదాయ విభాగం CIO మనీష్ పాండ్యా ప్రకారం..ప్రస్తుతం Silver ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, ఈ ర్యాలీ ముగిసిన తర్వాత 50 శాతం వరకు కరెక్షన్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. పెట్టుబడిదారులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన సూచిస్తున్నారు. ఇదిలా ఉండగా, ట్రంప్ పరిపాలనకు సంబంధించిన సెక్షన్ 232 నివేదిక ఆలస్యం కావడం కూడా వెండి మార్కెట్పై ప్రభావం చూపుతోంది.
నివేదిక విడుదలైన తర్వాత పన్నుల భయం తగ్గితే, అమెరికాలో వెండి నిల్వల డిమాండ్ తగ్గే అవకాశం ఉంది. అయితే అప్పటివరకు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అమెరికాకు వెండి ప్రవాహం కొనసాగవచ్చు, ఇది ధరలను మరింత ఎగదోసే అవకాశాన్ని కల్పిస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే వెండి ప్రస్తుతం అవకాశాలతో పాటు భారీ ముప్పు కలిగి ఉన్న ఆస్తిగా కూడా మారింది. అధిక లాభాల ఆశతో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కంటే, చరిత్రను గుర్తుంచుకుని జాగ్రత్తగా ముందుకు సాగడమే పెట్టుబడిదారులకు మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
More From GoodReturns

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..



Click it and Unblock the Notifications