Paisa Double: రెండు నెలల్లో రెండితలైన పెట్టుబడి.. ఇప్పడు బహుమతిగా ఉచిత షేర్లు..
Paisa Double: పెట్టుబడిని రెండింతలు చేయటం అనేది ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో చాలా కష్టమని మనందరికీ తెలిసిందే. కానీ ఇవేవి పట్టనట్లుగా కొన్ని షేర్లు మాత్రం తమ ఇన్వెస్టర్లకు మంచి రాబడులను, బోనస్ షేర్లను అందిస్తూ రత్నాల్లాగా మెరిసిపోతున్నాయి.
కంపెనీ వివరాలు..
ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది ఆగ్రోకెమికల్ రంగంలోని సిక్కో ఇండస్ట్రీస్ కంపెనీ గురించే. ఇన్వెస్టర్ల సంపదను స్వల్ప కాలంలోనే ఈ స్టాక్ డబుల్ చేసేసింది. ఈ మల్టీబ్యాగర్ స్టాక్ ప్రస్తుతం పెట్టుబడిదారులకు 1:2 రేషియోలో బోనస్ షేర్లను అందిస్తోంది. అంటే ప్రతి రెండు షేర్లు కలిగి ఉన్న వారికి ఒక షేర్ ఉచితంగా లభించనుంది. కంపెనీ బోనస్ షేర్లు అందించటానికి అక్టోబర్ 28ని రికార్డు తేదీగా నిర్ణయించింది.
కేవలం రెండు నెలల్లో..
ఆగ్రోకెమికల్ కంపెనీ షేర్లు 18 ఆగస్టు 2022న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ లో రూ.38.83 స్థాయిలో ఉన్నాయి. కానీ ఈ రోజు స్టాక్ 5 శాతం పెరిగి రూ.100.40 వద్ద అప్పర్ సర్కూట్ లో లాక్ అయ్యాయి. అంటే ఈ కాలంలో ఇన్వెస్టర్ల పెట్టుబడిని కంపెనీ దాదాపు రెండింతలు చేసింది. అలాగే మూడేళ్ల కాలంలో షేర్ ఏకంగా 1000 శాతం రాబడిని అందించింది. స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.172.95 వద్ద ఉండగా, కంపెనీ 52 వారాల కనిష్ఠ ధర రూ.42.20గా ఉంది.
ఏడాది కాలంలో..
గత ఏడాదిలో పెట్టుబడిదారులకు 270% రాబడిని ఇచ్చింది. అక్టోబర్ 22, 2021న NSEలో కంపెనీ షేర్లు రూ.38.60 స్థాయిలో ఉన్నాయి. అక్టోబర్ 28, 2022 NSEలో కంపెనీ షేర్లు రూ.100.40 వద్ద ట్రేడ్ అవుతోంది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.168.68 కోట్లుగా ఉంది. అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ కంపెనీకి రెండు సబ్సిడరీ కంపెనీలు కూడా ఉన్నాయి.
కంపెనీ వ్యాపారం..
సికో ఇండస్ట్రీస్ లిమిటెడ్ మట్టి కండీషనర్లు, సేంద్రీయ పురుగుమందులు, వ్యవసాయ ఫంగిసైడ్స్ వంటి అధిక నాణ్యత గల వ్యవసాయ ఉత్పత్తులను సరఫరా చేస్తుంది. కంపెనీకి రోజుకు 50000 లీటర్లకు పైగా అగ్రికెమికల్స్, 240MT ఎరువులు, 28000 HDPE సీసాలు ఉత్పత్తి సామర్థ్యం ఉంది. సెప్టెంబర్ 2022 త్రైమాసిక షేర్ హోల్డింగ్ డేటా ప్రకారం కంపెనీలో ప్రమోటర్లకు 71.43 శాతం వాటా ఉంది.