Signoria Creation IPO: మార్కెట్ల పనితీరుతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నట్లుగా ఐపీవోలు దూసుకుపోతున్నాయి. ఇన్వెస్టర్లు ఆశించిన విధంగానే రెట్టింపు రాబడులను లిస్టింగ్ సమయంలోనే అందిస్తున్నాయి. దీంతో ఇన్వెస్టర్లలో ఐపీవోల జోష్ కొనసాగుతోంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది సిగ్నోరియా క్రియేషన్ ఐపీవో గురించే. నేడు మార్కెట్లోకి అడుగుపెట్టిన కంపెనీ షేర్లు బంపర్ లిస్టింగ్ నమోదు చేశాయి. ఎన్ఎస్ఈలో కంపెనీ షేర్లు అరంగేట్రం చేశాయి. సిగ్నోరియా షేర్లు 101 శాతం ప్రీమియంతో రూ.131 రేటు వద్ద జాబితా చేయబడ్డాయి. వాస్తవానికి కంపెనీ ఇష్యూ సమయంలో ఒక్కో షేరుకు గరిష్ఠ ధరను రూ.65గా ఉంచింది. ఈ లెక్కన తొలిరోజే ఇన్వెస్టర్ల డబ్బు డబుల్ అయ్యింది.

కంపెనీ ఐపీవో సబ్స్క్రిప్షన్ కోసం మార్చి 12 నుంచి 14 వరకు తెరచి ఉంచబడింది. ఈ క్రమంలో కంపెనీ ఒక్కో షేరుకు విక్రయ ప్రైస్ బ్యాండ్ ధరను రూ.61 నుంచి రూ.65గా నిర్ణయించబడింది. అలాగే లాట్ పరిమాణాన్ని 2000 షేర్లుగా ప్రకటించింది. అలాగే పబ్లిక్ ఇష్యూలో 50% కంటే ఎక్కువ షేర్లను క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ కొనుగోలుదారుల(QIB) కోసం, 15% నాన్-ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు(NII) కోసం, మిగిలిన 35% రిటైల్ ఇన్వెస్టర్ల కోసం రిజర్వ్ చేసింది. ఐపీవో ద్వారా కంపెనీ మార్కెట్ల నుంచి రూ.9.3 కోట్లను సమీకరిస్తుండగా.. దీనికోసం 14.28 లక్షల తాజా ఈక్విటీ షేర్లను విక్రయించింది.
కంపెనీ ఐపీవోకి పెట్టుబడిదారుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఇది 600 కంటే ఎక్కువ సార్లు సభ్యత్వాన్ని పొందింది. రిటైల్ ఇన్వెస్టర్ల ద్వారా 649.88 రెట్లు, నాన్-ఇన్స్టిట్యూషనల్ కొనుగోలుదారుల ద్వారా 1,290.56 రెట్లు, అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదారుల ద్వారా 107.56 రెట్లు సబ్స్క్రిప్షన్ పొందింది. ఎస్ఎమ్ఈ కేటగిరీలో వచ్చిన ఐపీవో ఇన్వెస్టర్లకు ఊహించని రీతిలో అద్భుత లాభాలను బంపర్ లిస్టింగ్ ద్వారా అందించటంతో పెట్టుబడిదారుల్లో కోలాహలం కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications