Shree Marutinandan IPO: అదృష్టం ఉండాలే గానీ ఐపీవోల్లో డబ్బులు సంపాదించటం క్షణాల్లో పనని మరోసారి రుజువైంది. అవును ఈరోజు మార్కెట్లో జాబితా అయిన ఒక కంపెనీ రెప్పపాటు కాలంలోనే భారీ లాభాలను ఇన్వెస్టర్లకు తెచ్చిపెట్టింది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది శ్రీ మారుతీనందన్ ట్యూబ్స్ కంపెనీ ఐపీవో గురించే. తొలిరోజే అత్భుతం చేసిన ఈ ఐపీవో షేర్లు ఒక్కొక్కటి రూ.200 రేటు వద్ద జాబితా చేయబడ్డాయి. దీని వల్ల ఇన్వెస్టర్లు ఒక షేరుపై లిస్టింగ్ సమయంలో 39 శాతం లాభాన్ని పొందారు. కంపెనీ ఐపీవో గరిష్ఠ ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ.143గా ఉంది.

స్టాక్ మార్కెట్లోకి లిస్టయిన నిమిషంలోపే కంపెనీ షేర్లు 5 శాతం అప్పర్ సర్క్యూట్ను తాకాయి. దీంతో షేర్ ధర రూ.210 స్థాయికి చేరుకుంది. దీంతో బీఎస్ఈ ఎస్ఎమ్ఈ కేటగిరీలో నేడు మార్కెట్లోకి అడుగుపెట్టిన ఐపీవో తన ఇన్వెస్టర్లకు తొలిరోజు మెుత్తంగా 46 శాతం రాబడిని అందించింది. ఈ ఐపీవోపై చాలా మంది పెట్టుబడిదారులు బెట్టింగ్ వేశారు.
శ్రీ మారుతీనందార్ ట్యూబ్స్ ఐపీవోకు ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభించింది. ఐపీవో చివరి రోజున 47.16 రెట్లు సబ్స్క్రిప్షన్ను పొందింది. ఇది రిటైల్ కేటగిరీలో 59.71 రెట్లు, ఇతర కేటగిరీల్లో సభ్యత్వం 32.67 రెట్లుగా నమోదైంది. వాస్తవానికి కంపెనీ తాజా ఐపీవో ద్వారా మెుత్తంగా రూ.14.20 కోట్లను సమీకరించింది.
ఎస్ఎమ్ఈ కేటగిరీలో వచ్చిన ఐపీవో జనవరి 12 నుంచి 16 వరకు తెరచి ఉంది. ఈ క్రమంలో ఐపీవో ఇష్యూ కోసం గరిష్ఠ ప్రైస్ బ్యాండ్ ధరను కంపెనీ రూ.143గా నిర్ణయించింది. రిటైల్ ఇన్వెస్టర్ల లాట్ పరిమాణం 1000 షేర్లుగా ఉంది. అంటే ఎవరైనా పెట్టుబడిదారులు దరఖాస్తు చేయాలంటే కనీసం రూ.1,43,000 వెచ్చించాల్సి ఉంది. తాజా ఐపీవోతో కంపెనీలో ప్రమోటర్ల వాటా గతంలో ఉన్న 82 శాతం నుంచి 58.30 శాతానికి తగ్గింది.
More From GoodReturns

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications