Gold News: దాదాపు రెండు నెలల నుంచి పసిడి ధరలు సామాన్యులకు అంతుచిక్కని రీతిలో పెరిగిపోతున్నాయి. వాస్తవానికి డాలర్ బలపడుతున్నప్పుడు పసిడి రేట్లు తగ్గాలి. కానీ ప్రస్తుత పరిస్థితులు దీనికి పూర్తి భిన్నంగా కొనసాగుతున్నాయి. దీంతో భవిష్యత్తులో బంగారం భారతీయ కుటుంబాలకు ఒక అందని ద్రాక్షగా మారుతుందా అనే భయాలు సైతం కలిగించింది రేట్ల ర్యాలీ.
గత ఏడాది నుంచి క్రమంగా పెరుగుతున్న పసిడి ధరల ర్యాలీ 2025లో కూడా నిరంతరంగా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో 24 క్యారెట్ల పసిడి గ్రాము రేటు 11 శాతం పెరిగి దాదాపు రూ.8600 స్థాయిల వద్ద ప్రస్తుతం కొనసాగుతోంది. ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య సుంకాల బెదిరింపులు ఆందోళనలు కలిగించటంతో అకస్మాత్తుగా పసిడికి డిమాండ్ పెరిగిపోయింది. ట్రంప్ చర్యలతో ఏర్పడే ద్రవ్యోల్బణ పరిస్థితులను ఎదుర్కోవటానికి ఇండియా, చైనా వంటి దేశాల సెంట్రల్ బ్యాంకులు సేఫ్ హెవెన్ పసిడిని కూడబెట్టుకుంటున్నాయి. ఆర్థిక స్థిరత్వం కోసం గోల్డ్తో రక్షణ గోడలు ఇవి నిర్మిస్తున్నాయి.

ఈ క్రమంలో రానున్న కొన్ని నెలల్లో గోల్డ్ రిటైల్ విక్రయ ధర 10 గ్రాములకు లక్ష మార్కును చేరుకుంటుందా అనే డిబేస్ ప్రస్తుతం కొనసాగుతోంది. ప్రస్తుతం ఉన్న ధర నుంచి లక్ష మార్కును చేరుకోవటానికి పసిడి కేవలం 16 శాతం లేదా రూ.14,000 మాత్రమే దూరంలో ఉంది. ఇది అందుకోవటం అసాధ్యమైనది కాదని నిపుణులు అంటున్నారు. ప్రస్తుత స్థాయిలో పసిడి ధరల ర్యాలీ కొనసాగితే రానున్న కొన్ని నెలల కాలంలోనే గోల్డ్ రేటు రూ.లక్ష మార్కును చేరుకోవటం సులువేనని అంటున్నారు. మరోపక్క ఎంసీఎక్స్ లో పసిడి ధర మంగళవారం ఏప్రిల్ ఫ్యూచర్స్ ఏకంగా రూ.86,360ని తాకి సరికొత్త జీవితకాల గరిష్ఠాన్ని తాకేసింది.
వరుసగా పసిడి ధరల ర్యాలీ తర్వాత ప్రస్తుతం గోల్డ్ రేట్లు కొంత ఊపిరి పీల్చుకుంటున్నాయి. అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ స్వల్పంగా ధరలు తగ్గాయి. స్వల్పకాలిక ఫ్యూచర్స్ ట్రేడర్ల నుంచి లాభాల స్వీకరణను చూడటంతో ప్రస్తుతం రేట్లు కొంత తగ్గుముఖం పట్టాయని కిట్కో మెటల్స్, సీనియర్ మార్కెట్ అనలిస్ట్ జిమ్ వైకాఫ్ పేర్కొన్నారు. స్టీల్, అల్యూమినియం దిగుమతులపై ఏకీకృత 25 శాతం సుంకాన్ని అన్ని దేశాలపై విధించాలని ట్రంప్ తీసుకున్న నిర్ణయం మెరికాలో కష్టాల్లో ఉన్న పరిశ్రమలకు సహాయం చేస్తుందన్నారు. ఇదే క్రమంలో ఈ చర్య బహుళ-ముఖ వాణిజ్య యుద్ధానికి దారితీసే ప్రమాదం కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో స్టాక్ అండ్ కమోడిటీ మార్కెట్లలోని పెట్టుబడిదారులు అమెరికాలో ద్రవ్యోల్బణం సమాచారంపై దృష్టి సారిస్తూ అప్రమత్తంగా ఉంటున్నారు. అయితే ఇదే క్రమంలో ఫెడ్ చైర్ పావెల్ కూడా వడ్డీ రేట్ల తగ్గింపు నిర్ణయం తీసుకోవటానికి మరో త్రైమాసికం వేచి చూడవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా భవిష్యత్తులో రేట్ల తగ్గింపుల చర్యలు ఉండవచ్చని భావిస్తున్నారు. ఇటీవల పావెల్ సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను హడావిడిగా తగ్గించే ఆలోచనలో లేనట్లు వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం బలంగానే ఉందని అయితే ద్రవ్యోల్బణాన్ని 2 శాతం పరిమితిలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు.
More From GoodReturns

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications