స్టాక్ మార్కెట్ అప్‌డేట్: వెంటాడుతున్న నష్టాలు.. ఇన్వెస్టర్ల చూపు వీటిపైనే..

స్టాక్ మార్కెట్ పతనం వెంటాడుతుంది. గత వరం చివరిలో కాస్త కోలుకున్న ఈ వారం మొదటి నుండే మళ్ళీ నష్టాలను కొనసాగించాయి. దింతో భారత స్టాక్ మార్కెట్ సోమవారం క్షీణతతో ముగిసింది. ఈ క్షీణతకు ముఖ్య కారణం రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్ వంటి పెద్ద స్టాక్‌లు పడిపోవడం. ఇంకా అమెరికా సుంకాలపై అనిశ్చితి కూడా మార్కెట్‌పై ఒత్తిడిని పెంచింది. నిన్న బిఎస్‌ఇ సెన్సెక్స్ 217.41 పాయింట్లు లేదా 0.29% తగ్గి 74,115.17 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 ఇండెక్స్ 92.20 పాయింట్లు లేదా 0.41% తగ్గి 22,460.30 వద్ద ముగిసింది. ప్రపంచ స్థాయిలో తలెత్తుతున్న ఇబ్బందులు షేర్ మార్కెట్ వాతావరణాన్ని ప్రభావితం చేస్తున్నాయని నిపుణులు అంటున్నారు. అమెరికాలో నిరుద్యోగిత రేటు, సుంకాల పెరుగుదలపై అనిశ్చితి నెలకొంది. దీని వల్ల రాబోయే కాలంలో మార్కెట్ హెచ్చుతగ్గులకు లోనవుతుందని సూచిస్తుంది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, దేశీయ ఆర్థిక డేటా పెట్టుబడిదారులను తక్కువ ధరల స్టాక్‌లలో పెట్టుబడి పెట్టడానికి ప్రోత్సహిస్తోంది. అయితే జాగ్రత్తగా వహించాల్సి ఉంటుంది. దీర్ఘకాలంలో చూస్తే స్టాక్ మార్కెట్ ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఈ వారం అనేక ఆర్థిక డేటాలు విడుదల కానున్నాయి, వాటిలో అమెరికా అండ్ భారతదేశం నుండి CPI డేటా కూడా ఉంది. మార్కెట్ అస్థిరతను అంచనా వేయడానికి పెట్టుబడిదారులు ఈ గణాంకాలను నిశితంగా గమనిస్తారు.

share market update on 11 march investors keep eye on godrej industries and zee entertainment

అత్యంత ఆక్టివ్ షేర్లు: NSEలో వాల్యూ ప్రకారం అత్యధికంగా ట్రేడవుతున్న స్టాక్‌లు BSE (₹1,694 కోట్లు), రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (₹1,486 కోట్లు), ఇండస్‌ఇండ్ బ్యాంక్ (₹1,445 కోట్లు), జొమాటో (₹1,340 కోట్లు), HDFC బ్యాంక్ (₹1,318 కోట్లు), ఇన్ఫోసిస్ (₹1,287 కోట్లు), డేటా ప్యాటర్న్స్ (ఇండియా) (₹1,220 కోట్లు).

NSEలో అత్యధికంగా ట్రేడ్ అయిన స్టాక్‌లు వొడాఫోన్ ఐడియా (షేర్లు ట్రేడ్: 43.88 కోట్లు), సుజ్లాన్ ఎనర్జీ (షేర్లు ట్రేడ్: 8.14 కోట్లు), యెస్ బ్యాంక్ (షేర్లు ట్రేడ్: 6.86 కోట్లు), జొమాటో (షేర్లు ట్రేడ్: 6.27 కోట్లు), టాటా స్టీల్ (షేర్లు ట్రేడ్: 5.44 కోట్లు), JP పవర్ (షేర్లు ట్రేడ్: 3.16 కోట్లు), పవర్ గ్రిడ్ (షేర్లు ట్రేడ్: 3.02 కోట్లు).

డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్, గోద్రేజ్ ఇండస్ట్రీస్, సోలార్ సొల్యూషన్స్, జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్, సనోఫీ ఇండియా, ఆవాస్ ఫైనాన్షియర్స్, అవంతి ఫీడ్స్ షేర్లు గొప్పగా కొనుగోలుదారుల ఆసక్తిని కనబరిచాయి. 75 స్టాక్‌లు నేడు 52 వారాల గరిష్ట స్థాయిని తాకగా, 129 స్టాక్‌లు 52 వారాల కనిష్ట స్థాయిని చేరాయి. మరోవైపు, 360 వన్ వామ్, త్రివేణి టర్బైన్, జెఎం ఫైనాన్షియల్, అప్పర్ ఇండస్ట్రీస్, సన్ ఫార్మా అడ్వాన్స్‌డ్ రీసెర్చ్, టిటాగఢ్ రైల్ సిస్టమ్స్, మహీంద్రా లైఫ్‌స్పేస్ డెవలపర్స్ భారీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+