మార్కెట్: 42,000తో రికార్డ్ గరిష్టానికి సెన్సెక్స్, 12,300 సమీపంలో నిఫ్టీ

ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 42,000 మార్క్‌ను అందుకుంది. నిఫ్టీ 12,400కు సమీపంలో జీవితకాల గరిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.11.19 నిమిషాలకు సెన్సెక్స్ 44.79 (0.11%) పాయింట్లు ఎగిసి 41,827.94 వద్ద, నిఫ్టీ 20.90 (0.17%) ఎగిసి 12,322.40 వద్దకు చేరుకుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.70.71 వద్ద ట్రేడ్ అయింది.

అమెరికా-చైనా మధ్య తొలిదశ వాణిజ్య ఒప్పందం కుదరడంతో అంతర్జాతీయ సూచీలు దూసుకెళ్లాయి. ఇది దేశీయ మార్కెట్ సెంటిమెంటును కూడా పెంచింది. దీంతో మార్కెట్లు నేడు లాభాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. యస్ బ్యాంకు, హెచ్‌యూఎల్, నెస్లే, పవర్ గ్రిడ్ కార్పోరేషన్, కొటక్ మహీంద్రా షేర్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. వేదాంత, హిండాల్కో, టాటా స్టీల్ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి. అంతకుముందు బుధవారం మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.

Share Market: Sensex tops 42,000 for first time, Nifty nears 12,400

మధ్యాహ్నం పదకొండున్నర సమయానికి టాప్ గెయినర్స్‌లో ఐచర్ మోటార్స్, నెస్ట్లె, పవర్ గ్రిడ్ కార్పోరేషన్, భారతీ ఎయిర్ టెల్, బ్రిటానియా ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో కోల్ ఇండియా, వేదాంత, జేఎస్‌డబ్ల్యు స్టీల్, ఎన్టీపీసీ, టాటా స్టీల్ ఉన్నాయి. మెటల్ రంగం ఒత్తిడిని ఎదుర్కొంది. ఇన్ఫోసిస్, బ్యాంకు స్టాక్స్ దూసుకెళ్తున్నాయి. ఫార్మా రంగం స్టాక్స్ లాభాల్లో ట్రేడ్ అయ్యాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+