ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 42,000 మార్క్ను అందుకుంది. నిఫ్టీ 12,400కు సమీపంలో జీవితకాల గరిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.11.19 నిమిషాలకు సెన్సెక్స్ 44.79 (0.11%) పాయింట్లు ఎగిసి 41,827.94 వద్ద, నిఫ్టీ 20.90 (0.17%) ఎగిసి 12,322.40 వద్దకు చేరుకుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.70.71 వద్ద ట్రేడ్ అయింది.
అమెరికా-చైనా మధ్య తొలిదశ వాణిజ్య ఒప్పందం కుదరడంతో అంతర్జాతీయ సూచీలు దూసుకెళ్లాయి. ఇది దేశీయ మార్కెట్ సెంటిమెంటును కూడా పెంచింది. దీంతో మార్కెట్లు నేడు లాభాల్లో ట్రేడింగ్ను ప్రారంభించాయి. యస్ బ్యాంకు, హెచ్యూఎల్, నెస్లే, పవర్ గ్రిడ్ కార్పోరేషన్, కొటక్ మహీంద్రా షేర్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. వేదాంత, హిండాల్కో, టాటా స్టీల్ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి. అంతకుముందు బుధవారం మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.

మధ్యాహ్నం పదకొండున్నర సమయానికి టాప్ గెయినర్స్లో ఐచర్ మోటార్స్, నెస్ట్లె, పవర్ గ్రిడ్ కార్పోరేషన్, భారతీ ఎయిర్ టెల్, బ్రిటానియా ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో కోల్ ఇండియా, వేదాంత, జేఎస్డబ్ల్యు స్టీల్, ఎన్టీపీసీ, టాటా స్టీల్ ఉన్నాయి. మెటల్ రంగం ఒత్తిడిని ఎదుర్కొంది. ఇన్ఫోసిస్, బ్యాంకు స్టాక్స్ దూసుకెళ్తున్నాయి. ఫార్మా రంగం స్టాక్స్ లాభాల్లో ట్రేడ్ అయ్యాయి.
More From GoodReturns

Bengaluru: బెంగళూరు వదిలి ఐర్లాండ్కు.. ఖర్చు పెరిగినా సంతోషంగా ఉన్నానంటున్న టెక్కీ!

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

బెంగళూరు రియల్ ఎస్టేట్.. ఈ ఒక్క కారిడార్కు పుల్లు డిమాండ్.. ఇళ్లను ఎగబడి కొంటున్న ఇన్వెస్టర్లు..

కుప్పకూలిన భారత ఐటీ స్టాక్స్.. కొంపలు ముంచిన ఎన్విడియా AI ప్రకటన.. ఆందోళనలో ఇన్వెస్టర్లు..

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల చూస్తే పసిడి జోలికే పోరు.. మార్చి 17, మంగళవారం ధరలు ఇవే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

బంగారం ధరలు తగ్గిపోతున్నాయి.. ఈ రోజు ఎంత ఢమాల్ అయిందంటే.. మార్చి 16, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

మార్కెట్ క్రాష్ సమయంలో ఇన్వెస్టర్లకు నగదు చాలా కీలకం.. రాబర్ట్ కియోసాకి సంచలన వ్యాఖ్యలు..



Click it and Unblock the Notifications