Sovereign Gold Bonds: భారత ప్రభుత్వం తీసుకొచ్చిన సావరిన్ గోల్డ్ బాండ్స్ స్కీమ్ భారీగా ప్రజాధరణను పొందిన సంగతి తెలిసిందే. చాలా మంది డిజిటల్ గా బంగారంలో పెట్టుబడులను పెట్టి ప్రస్తుతం మంచి రాబడులను చూస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా సావరిన్ గోల్డ్ బాండ్స్ ప్రీమెచ్యూర్ రిడెంప్షన్ గురించి భారీగా చర్చ కొనసాగుతోంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా సావరిన్ గోల్డ్ బాండ్స్ సిరీస్ VIII గురించే. వాస్తవానికి దీనిని ప్రజలకు 2017-18 మధ్యకాలంలో విక్రయించబడినప్పటికీ నవంబర్ 19, 2024తో ప్రీమెచ్యూర్ అయ్యాయి. అయితే 5 ఏళ్లు పూర్తి చేసుకోవటంతో ప్రస్తుతం వీటిని ప్రజలు వెనక్కి తీసుకునేందుకు వెసులుబాటు కల్పించబడింది. దీనికోసం రిజర్వు బ్యాంక్ రిడెంప్షన్ ధరను యూనిట్కు రూ.7460గా నిర్ణయించబడింది. వాస్తవానికి ఈ రేటు నవంబర్ 13 నుంచి 15 వరుకు రిటైల్ మార్కెట్లో ఉన్న విక్రయ ధరకు సగటు కావటం గమనార్హం. వాస్తవానికి 2017లో సిరీస్ విక్రయానికి ఉంచినప్పుడు గ్రాము గోల్డ్ ధర కేవలం రూ.2961 వద్ద ఉండగా ప్రస్తుతం అందిస్తున్న ధరతో పోల్చినప్పుడు పెట్టుబడిదారులు ఏకంగా 152 శాతం భారీ రాబడిని పొందుతున్నారు.

అయితే ఈ సిరీస్ సావరిన్ గోల్డ్ బాండ్స్ మెచ్యూరిటీ తేదీ నవంబర్ 20, 2025గా ఉన్న సంగతి తెలిసిందే. అయితే లాకిన్ పిరియడ్ పూర్తి కాగానే పెట్టుబడిదారులు తమ అవసరాల కోసం ముందుగానే తీసుకునేందుకు వెసులుబాటు కల్పించబడింది. ఇది బాండ్ వడ్డీ చెల్లింపు తేదీలతో సమానంగా ఉండాలి. నవంబర్ 20, 2017న జారీ చేయబడిన సిరీస్ VIII కోసం.. ఐదేళ్లు పూర్తయిన తర్వాత నవంబర్ 2022లో ప్రీమెచ్యూర్ రిడెంప్షన్కు మొదటి అవకాశం లభించింది. నవంబర్ 19, 2024న తాజా రిడెంప్షన్ తేదీ, అర్హత ఉన్న పెట్టుబడిదారులకు మరో అవకాశాన్ని అందిస్తుంది. రిడెంప్షన్ తేదీకి ముందు వారంలో 999 స్వచ్ఛత బంగారం సగటు ముగింపు ధర ఆధారంగా రిజర్వ్ బ్యాంక్ ఫైనల్ రిడెంప్షన్ ధర నిర్ణయించబడుతుంది. ఈ సగటు ముగింపు ధరను ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్ అందిస్తుందని గుర్తుంచుకోవాలి.
వాస్తవానికి గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ కింద 2015లో ప్రారంభించబడిన SGBలు భారత ప్రభుత్వంతో సంప్రదించి RBI ద్వారా కాలానుగుణంగా జారీ చేయబడతాయి. సాధారణంగా ఎనిమిదేళ్ల కాలవ్యవధిని కలిగి ఉంటాయి. వడ్డీ చెల్లింపు తేదీలలో ఐదవ సంవత్సరం తర్వాత నిష్క్రమించే అవకాశం ఉంటుంది. అలాగే ప్రస్తుతం వీటికి 2.5 శాతం వడ్డీని కేంద్రం ఆఫర్ చేస్తోంది. స్కీమ్ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో వ్యక్తులు, HUFలు కనిష్టంగా 1 గ్రాము నుంచి గరిష్టంగా 4 కిలోగ్రాముల వరకు బాండ్స్ కొనుగోలు చేయవచ్చు. ఇక ట్రస్టులకు ఈ పరిమితి 20 కిలోలుగా నిర్ణయించబడింది.
డీమ్యాట్ ఖాతాలు, నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్లైన్లో లేదా బ్యాంకులు, నియమించబడిన పోస్టాఫీసుల వంటి అధీకృత ఆర్థిక సంస్థల ద్వారా ఆఫ్లైన్ కొనుగోలుకు అవకాశం కల్పించబడింది. ఆఫ్లైన్ పెట్టుబడిని బ్యాంకులు, పోస్టాఫీసులలో చేయవచ్చు. ఇక్కడ పెట్టుబడిదారులు భౌతిక దరఖాస్తు ఫారమ్లను మరియు నగదు, చెక్కులు లేదా డిమాండ్ డ్రాఫ్ట్ల వంటి చెల్లింపు పద్ధతులను ఉపయోగించవచ్చు. ముఖ్యంగా బంగారం మార్కెట్ ధర తగ్గితే మూలధన నష్టం సంభవించే అవకాశం ఉంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications