వచ్చే ఏడాది సెన్సెక్స్ 45,000 మార్క్ చేరుకోవచ్చునని దేశీయ బ్రోకరేజీ సంస్థ కొటక్ సెక్యూరిటీస్ అంచనా వేసింది. 2020లో సూచీలు 12.5 శాతం మేర లాభాలు అందుకుంటాయని పేర్కొంది. ఆర్థిక వ్యవస్థ కుంటుతూ నడుస్తోందని, మరో ఏడాది పాటు ఈ తిప్పలు తప్పవని ఆర్థిక నిపుణుల ఇప్పటికే అంచనా వేస్తున్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న ఉద్ధీపన చర్యలు అన్ని రంగాలకు దీర్ఘకాలంలో ఊతమిస్తాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది నాటికి ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని చెబుతున్నారు.
ఆర్థిక మందగమనంలోను స్టాక్ మార్కెట్లు అప్పుడప్పుడు మినహా జోరుమీద ఉన్నాయి. స్టాక్ మార్కెట్ల రికార్డుల హోరుకు కాస్త అప్పుడప్పుడు బ్రేక్ పడినా వచ్చే ఏడాది దేశీయ స్టాక్ మార్కెట్ జోరుకు ఢోకా ఉండదని బ్రోకరేజీ సంస్థలు అంచనా వేస్తున్నాయి. కోటక్ సెక్యూరిటీస్ కూడా ఆశాజనకంగా ఉంటుందని తెలిపింది.

వచ్చే ఏడాది డిసెంబరు నాటికి సెన్సెక్స్ 45,500 పాయింట్ల కీలక మైలురాయికి చేరుకుంటుందని నివేదికలో పేర్కొంది. శుక్రవారం నాటి సెన్సెక్స్ ముగింపు 40,445 పాయింట్లతో పోలిస్తే ఇది దాదా పు 12.5 శాతం ఎక్కువ. ఆర్థిక వ్యవస్థలో సెంటిమెంట్ సానుకూలంగా ఉందని, 2020 డిసెంబర్ నాటికి సెన్సెక్స్ 45,500 పాయింట్లకు చేరుకుంటుందని, మోడీ ప్రభుత్వం కార్పోరేట్ పన్ను రేటు తగ్గింపు కారణంగా ఫలితాలు రాణిస్తాయని పేర్కొంది.
కార్పొరేట్ టాక్స్ కోతతో పెరగనున్న కంపెనీల రాబడులు, ఎఫ్పీఐలు, సిప్ పెట్టుబడులు వచ్చే ఏడాది దేశీయ స్టాక్ మార్కెట్ను ముందుకు తీసుకు వెళ్తాయని కోటక్ సెక్యూరిటీస్ పేర్కొంది. అయితే నిర్వహణ సరిగా లేని కంపెనీల షేర్ల జోలికి మాత్రం పోవద్దని ఇన్వెస్టర్లను హెచ్చరించింది. వచ్చే ఏడాది ఇన్వెస్టర్లకు మంచి లాభాలు తెచ్చిపెట్టే అవకాశమున్న కొన్ని రంగాలనూ తన నివేదికలో పేర్కొంది.
బ్యాంకింగ్, మాతృసంస్థల అండ ఉన్న NBFCలు, ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీలు, క్యాపిటల్ గూడ్స్ సంస్థలు, నిర్మాణ రంగ సంస్థలు, నిర్మాణ రంగ కంపెనీలు, హెల్త్ కేర్ కంపెనీలు, ఆగ్రో కెమికల్ కంపెనీలు.
More From GoodReturns

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..



Click it and Unblock the Notifications