ముంబై: భారత స్టాక్ మార్కెట్లు బుధవారం (మే 20) లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.16 సమయానికి సెన్సెక్స్ 148.28 పాయింట్లు లేదా 0.49% తగ్గి 30,344.45 పాయింట్ల వద్ద, నిఫ్టీ 42.85 పాయింట్లు లేదా 0.48% లాభపడి 8,921.95 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. 392 షేర్లు లాభాల్లో, 220 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 29 షేర్లలో ఎలాంటి మార్పులేదు. సెన్సెక్స్ ఆ తర్వాత దాదాపు 250 పాయింట్ల వరకు పెరిగింది.
ఐటీ ఇండెక్స్ మినహా మిగతా అన్ని రంగాలు కూడా లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. టాప్ గెయినర్స్ జాబితాలో యూపీఎల్, ఐటీసీ, లార్సన్, బీపీసీఎల్, నెస్ట్లే, టాప్ లూజర్స్ జాబితాలో భారతీ ఇన్ఫ్రాటెల్, ఇండస్ ఇండ్ బ్యాంకు, హీరో మోటో కార్ప్, వేదాంత, అదాని పోర్ట్స్ ఉన్నాయి.

సోమవారం వరకు వరుసగా నాలుగు రోజుల పాటు నష్టాలు చూసిన మార్కెట్లు మంగళవారం కోలుకున్నాయి. అయితే దేశీయంగా కరోనా కేసులు లక్ష దాటటంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. దీంతో ఓ దశలో సెన్సెక్స్ 700 పాయింట్లు ఎగిసినప్పటికీ, చివరకు 167 పాయింట్లు మాత్రం లాభపడి 30,196 వద్ద ముగిసింది. నిఫ్టీ 55.85 పాయింట్ల లాభంతో 8,879 పాయింట్ల వద్ద ముగిసింది.
మార్చి నెలతో ముగిసిన క్వార్టర్లో ఆర్పు పెరగడంతో భారతీ ఎయిర్ టెల్ షేర్ ఏకంగా 12.05 శాతం ఎగిసింది. తద్వారా 52 వారాల గరిష్టాన్ని తాకింది. చివరకు 11.34 శాతం లాభంతో రూ.599.15 వద్ద క్లోజ్ అయింది. ఈ రోజు కూడా మార్కెట్లు లాభాల్లోనే ప్రారంభమయ్యాయి.
More From GoodReturns

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..



Click it and Unblock the Notifications