చమురు దెబ్బ: భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ప్రారంభంలో రికార్డులతో ప్రారంభమై ఆ తర్వాత ఊగిసలాట నుంచి చివరకు నష్టాలతో క్లోజ్ అయ్యాయి. సెన్సెక్స్ 416.46 (0.99%) పాయింట్లు నష్టపోయి 41,528.91, నిఫ్టీ 121 పాయింట్లు నష్టపోయి 127.80 (1.03%) పాయింట్లు దిగజారి 12,224.55 వద్ద ముగిసింది.
డాలరుతో రూపాయి మారకం విలువ 71.11 వద్ద ట్రేడ్ అయింది. చమురు ధరల పెరుగుదల ప్రభావం కారణంగా సూచీలు నష్టపోయాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఉదయం మార్కెట్లు లాభాలతోనే ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి.
మన బడ్జెట్ కంటే 63మంది బిలియనీర్ల సంపదే ఎక్కువ, సీఈవో స్థాయి శాలరీ కోసం 22,000 ఏళ్లు
పవర్ గ్రిడ్ కార్పోరేషన్, భారతీ ఎయిర్ టెల్, భారతీ ఇన్ఫ్రాటెల్, గెయిల్ ఇండియా, ఏషియన్ పేయింట్స్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. కొటక్ మహీంద్రా, ఇండియన్ ఆయిల్, జీ ఎంటర్టైన్మెంట్స్, కోల్ ఇండియా, రిలయన్స్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు ఫ్లాట్గా ఉన్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లు మాత్రం భారీ లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. లిబియాలోని రెండు అతిపెద్ద క్రూడాయిల్ ఉత్పత్తి కేంద్రాలు మూసివేత నేపథ్యంలో ఆయిల్ ధరలు పెరిగాయి.