దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం (ఏప్రిల్ 25) భారీ నష్టాల్లో ముగిశాయి. ఉదయం ప్రతికూలంగా ప్రారంభమైన సూచీలు, ఏ దశలోను కోలుకోలేదు. పైగా అంతకంతకూ నష్టాల్లోకి వెళ్లాయి. మధ్యాహ్నం ఓ సమయంలో సెన్సెక్స్ దాదాపు 800 పాయింట్ల నష్టాల్లోకి వెళ్లినప్పటికీ కాస్త పుంజుకొని, 617 పాయింట్ల నష్టాల్లో ముగిసింది. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు సూచీలపై ప్రభావం చూపాయి. దీంతో గత రెండు సెషన్లలోనే సెన్సెక్స్ 1500 పాయింట్లకు పైగా క్షీణించింది.

సెన్సెక్స్ 600 పాయింట్లు డౌన్
సెన్సెక్స్ ఉదయం 56,757.64 పాయింట్ల వద్ద ప్రారంభమై, 56,875.65 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 56,356.87 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ క్రితం సెషన్లో 57,197 పాయింట్ల వద్ద ముగిసింది. కానీ నేడు ఏ సమయంలోను కనీసం 56,9000 తాకలేదు. సెన్సెక్స్ చివరకు 617 పాయింట్లు క్షీణించి 56,579 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 218 పాయింట్లు క్షీణించి 16,954 పాయింట్ల వద్ద ముగిసింది.

మార్కెట్ నష్టానికి కారణాలు
మార్కెట్ నష్టాలకు ఎన్నో కారణాలు ఉన్నాయి. వచ్చే నెల వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్ల మేర పెంచనున్నట్లు అమెరికా ఫెడ్ బ్యాంకు చైర్మన్ జోరోమ్ పోవెల్ ప్రకటించారు. ఇది అంతర్జాతీయ మార్కెట్ పైన ప్రతికూల ప్రభావం చూపింది. దీంతో భారత మార్కెట్లు కూడా నష్టపోయాయి.
చైనాలో కరోనా వ్యాప్తి ఆసియా - పసిఫిక్ మార్కెట్ సెంటిమెంటును దెబ్బతీసింది. చైనా సూచీలు ఓ దశలో ఆరు శాతానికి పైగా కుంగాయి. ఎఫ్ఎంసీజీ షేర్లు భారీగా పతనమయ్యాయి. ఇది మరింత నష్టాలకు కారణమైంది. పామాయిల్ పైన ఇండోనేషియా విధించిన నిషేధం ఏప్రిల్ 28న అమల్లోకి రావడం ఇందుకు కారణం. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం సూచీల సెంటిమెంటును దెబ్బతీసింది.

అన్ని రంగాలు నష్టాల్లోనే...
మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిశాయి. ఈ రెండు రోజుల కాలంలో ఇన్వెస్టర్ల సంపద రూ.6.5 లక్షల కోట్లు తగ్గింది. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,65,29,671.65 కోట్లకు తగ్గింది. బ్యాంకింగ్ మినహా అన్ని రంగాలు నష్టాల్లో ముగిశాయి.
More From GoodReturns

Stock market: ఐటీ స్టాక్స్ క్రాష్! నిఫ్టీ ఐటీ ఇండెక్స్ డౌన్.. భారీ నష్టాల్లో టాప్ కంపెనీలు!

భారీ నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్.. నిన్న లాభాలన్నీ ఆవిరి..పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

రేపు స్టాక్ మార్కెట్లకు సెలవు.. బ్యాంకులు కూడా పనిచేయవు.. ఈ రోజు పతనానికి విలవిలలాడుతున్న ఇన్వెస్టర్లు..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?



Click it and Unblock the Notifications