దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం (ఏప్రిల్ 25) భారీ నష్టాల్లో ముగిశాయి. ఉదయం ప్రతికూలంగా ప్రారంభమైన సూచీలు, ఏ దశలోను కోలుకోలేదు. పైగా అంతకంతకూ నష్టాల్లోకి వెళ్లాయి. మధ్యాహ్నం ఓ సమయంలో సెన్సెక్స్ దాదాపు 800 పాయింట్ల నష్టాల్లోకి వెళ్లినప్పటికీ కాస్త పుంజుకొని, 617 పాయింట్ల నష్టాల్లో ముగిసింది. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు సూచీలపై ప్రభావం చూపాయి. దీంతో గత రెండు సెషన్లలోనే సెన్సెక్స్ 1500 పాయింట్లకు పైగా క్షీణించింది.

సెన్సెక్స్ 600 పాయింట్లు డౌన్
సెన్సెక్స్ ఉదయం 56,757.64 పాయింట్ల వద్ద ప్రారంభమై, 56,875.65 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 56,356.87 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ క్రితం సెషన్లో 57,197 పాయింట్ల వద్ద ముగిసింది. కానీ నేడు ఏ సమయంలోను కనీసం 56,9000 తాకలేదు. సెన్సెక్స్ చివరకు 617 పాయింట్లు క్షీణించి 56,579 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 218 పాయింట్లు క్షీణించి 16,954 పాయింట్ల వద్ద ముగిసింది.

మార్కెట్ నష్టానికి కారణాలు
మార్కెట్ నష్టాలకు ఎన్నో కారణాలు ఉన్నాయి. వచ్చే నెల వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్ల మేర పెంచనున్నట్లు అమెరికా ఫెడ్ బ్యాంకు చైర్మన్ జోరోమ్ పోవెల్ ప్రకటించారు. ఇది అంతర్జాతీయ మార్కెట్ పైన ప్రతికూల ప్రభావం చూపింది. దీంతో భారత మార్కెట్లు కూడా నష్టపోయాయి.
చైనాలో కరోనా వ్యాప్తి ఆసియా - పసిఫిక్ మార్కెట్ సెంటిమెంటును దెబ్బతీసింది. చైనా సూచీలు ఓ దశలో ఆరు శాతానికి పైగా కుంగాయి. ఎఫ్ఎంసీజీ షేర్లు భారీగా పతనమయ్యాయి. ఇది మరింత నష్టాలకు కారణమైంది. పామాయిల్ పైన ఇండోనేషియా విధించిన నిషేధం ఏప్రిల్ 28న అమల్లోకి రావడం ఇందుకు కారణం. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం సూచీల సెంటిమెంటును దెబ్బతీసింది.

అన్ని రంగాలు నష్టాల్లోనే...
మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిశాయి. ఈ రెండు రోజుల కాలంలో ఇన్వెస్టర్ల సంపద రూ.6.5 లక్షల కోట్లు తగ్గింది. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,65,29,671.65 కోట్లకు తగ్గింది. బ్యాంకింగ్ మినహా అన్ని రంగాలు నష్టాల్లో ముగిశాయి.
More From GoodReturns

స్టాక్ మార్కెట్లో బ్లాక్ మండే.. భారీ నష్టాల్లో ట్రేడవుతున్న అన్ని రంగాలు.. ఇన్వెస్టర్లు విలవిల..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications