For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సరికొత్త రికార్డులకు మార్కెట్లు: 53,150 పాయింట్లు దాటిన సెన్సెక్స్, నిఫ్టీ 15,920కి పైన..

|

ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ సానుకూల సంకేతాలతో ఐటీ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. దీంతో సూచీలు ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకాయి. సెన్సెక్స్ 53,000 పాయింట్లను దాటగా, నిఫ్టీ 15900కు పైన నిలిచింది. మార్కెట్లు వరుసగా నాలుగో రోజు లాభాల్లో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు రోజంతా అదే లాభాల్లో కొనసాగి, చివరకు సరికొత్త గరిష్టాలను తాకి, ముగిశాయి.

మధ్యలో కొన్ని రంగాల షేర్లలో ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది. దీంతో ఓ దశలో సెన్సెక్స్ తడబడినట్లు కనిపించినా ఎక్కువ సేపు నిలువలేదు. నిన్న 52,904 పాయింట్ల వద్ద ముగిసిన సెన్సెక్స్, నేడు 52,968.89 పాయింట్ల వద్ద ప్రారంభమై, 53,266.12 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 52,948.43 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ 15,872.15 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,952.35 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 15,855.00 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 254.80 (0.48%) పాయింట్లు ఎగిసి 53,158.85 పాయింట్ల వద్ద, నిఫ్టీ 70.25 (0.44%) లాభపడి 15,924.20 పాయింట్ల వద్ద ముగిసింది.

Sensex surges 255 points to hit record closing high, Factors that driving market

నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో విప్రో, ఇన్ఫోసిస్, లార్సన్, హెచ్‌సీఎల్ టెక్, టాటా స్టీల్ ఉన్నాయి. HCL టెక్, లార్సన్, టెక్ మహీంద్రా, విప్రో, హిండాల్కో టాప్ గెయినర్స్ జాబితాలో ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో ఓఎన్జీసీ, ఐచర్ మోటార్స్, కోల్ ఇండియా, భారతీ ఎయిర్‌టెల్, మహీంద్రా అండ్ మహీంద్రా ఉన్నాయి.

English summary

సరికొత్త రికార్డులకు మార్కెట్లు: 53,150 పాయింట్లు దాటిన సెన్సెక్స్, నిఫ్టీ 15,920కి పైన.. | Sensex surges 255 points to hit record closing high, Factors that driving market

The Sensex closed at 53,158, up 254 , while the Nifty was at 15,924, up 70 points on Thursday.
Story first published: Thursday, July 15, 2021, 17:59 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X