స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి. నిన్న 650 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ నేడు (గురువారం, డిసెంబర్ 2) అంతకుమించి ఎగిసి 776 పాయింట్లు లాభపడింది. మార్కెట్లు ఉదయం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఏ సమయంలోను సూచీలు నష్టాల్లోకి జారుకోలేదు. ఐటీ, మెటల్, ఆటో, పవర్ రంగాలు పరుగులు పెట్టాయి. పవర్ గ్రిడ్, HDFC బ్యాంకు స్టాక్స్ నాలుగు శాతం చొప్పున లాభపడ్డాయి.
ఓ వైపు ఒమిక్రాన్ ఆందోళనలు నెలకొన్నప్పటికీ ఆయా దేశాల కరోనా కట్టడి చర్యలు, వ్యాక్సినేషన్ వంటి అంశాలు మార్కెట్ సెంటిమెంటును, జీఎస్టీ కలెక్షన్లు వంటివి కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచాయి. వాహన విక్రయాలు క్షీణించినప్పటికీ, కమర్షియల్ వెహికిల్ సేల్స్ పెరిగాయి. మొత్తానికి వాహన విక్రయాలు తగ్గినప్పటికీ సానుకూలత కనిపించింది. ఇవన్నీ మార్కెట్కు సానుకూలంగా ఉన్నాయి.

రెండ్రోజుల్లో 1400 పాయింట్లు
సెన్సెక్స్ 57,781.48 పాయింట్ల వద్ద ప్రారంభమై, 58,513.93 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 57,680.41 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 17,183.20 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,420.35 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,149.30 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 776.50 (1.35%) పాయింట్లు ఎగిసి 58,461.29 పాయింట్ల వద్ద, నిఫ్టీ 234.75 (1.37%) పాయింట్లు లాభపడి 17,401.65 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ తిరిగి 58,000 పాయింట్లను క్రాస్ చేయడం గమనార్హం. సెన్సెక్స్ రెండు రోజుల్లోనే 1400 పాయింట్లకు పైగా లాభపడింది.

బూస్టర్ డోస్
డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ రూ.74.99 వద్ద ఉంది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్తో పెద్దగా భయపడాల్సిన పని లేదని, బూస్టర్ డోసుతో అడ్డుకోవచ్చని వార్తలు రావడం స్టాక్ మార్కెట్ సెంటిమెంట్ బలపడటానికి ఉపయోగపడింది. పలు స్టాక్స్ భారీగా లాభపడ్డాయి.

రూ.5.47 లక్షల కోట్లు జంప్
మార్కెట్లు నేడు 770 పాయింట్లకు పైగా లాభపడటంతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3.28 లక్షల కోట్లు పెరిగింది. బుధవారం 600 పాయింట్లకు పైగా లాభపడి బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ 2.19 లక్షల కోట్లు పెరిగింది. ఈ రెండు రోజుల్లో ఇన్వెస్టర్ల సంపద రూ.5.47 లక్షల కోట్లు పెరిగింది.
More From GoodReturns

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

భారత స్టాక్ మార్కెట్లు పతనం.. చమురు ధరలు పెరగడంతో కుప్పకూలిన మార్కెట్

Stock market: మార్కెట్ షాక్ ఇచ్చినా భయం వద్దు.. ఇన్వెస్టర్లకు ఇవే సేఫ్ ఆప్షన్లు!

BSE: స్టాక్ మార్కెట్లో సరికొత్త ట్రెండ్.. సెన్సెక్స్లోనే కాకుండా ఇకపై వీటిలోనూ ట్రేడింగ్ చేయెచ్చు!

Investment: మార్కెట్ ఒడిదుడుకులకు భయపడుతున్నారా? ఈ టైంలో ధనవంతులు ఏం చేస్తారో తెలుసా?

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..



Click it and Unblock the Notifications