అంతర్జాతీయ వ్యతిరేక పవనాల ప్రభావం దేశీయ మార్కెట్లపై పడింది. దీంతో ఈ వారం సూచీలు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. గతవారం సెన్సెక్స్ 52,908 పాయింట్ల వద్ద ముగిసింది. నేడు స్వల్ప నష్టాల్లో ప్రారంభమైనప్పటికీ, ఆ తర్వాత కోలుకొని, 53,000 పాయింట్లను క్రాస్ చేసింది. అయితే అంతలోనే తిరిగి నష్టాల్లోకి జారుకుంది. అమెరికా మార్కెట్లు గతవారం నష్టాల్లో ముగిశాయి. ఈ రోజు అక్కడి మార్కెట్లకు సెలవు రోజు. ప్రస్తుతం అమెరికా ఫ్యూచర్స్ ఒత్తిడిలో ఉంది. ద్రవ్యోల్భణం, ఆర్థిక మాంద్యం భయాలు మార్కెట్లకు ఇంకా ఆందోళన కలిగిస్తున్నాయి.
దీనికి తోడు దేశీయంగా పెట్రోలియం ఉత్పత్తులపై అదనపు పన్నులు, కొన్ని వస్తువులు, సేవలపై జీఎస్టీని 12 శాతం నుండి నుండి 18 శాతానికి పెంచడం, మరిన్ని రేట్ల పెంపు ఉంటాయని ఫెడ్ చైర్మన్ జోరోమ్ పావెల్ సంకేతాలు వంటి అంశాలు సూచీలపై ప్రభావం చూపుతున్నాయి. జూన్ త్రైమాసికానికి సంబంధించిన ఆర్థిక ఫలితాలను కంపెనీలు ప్రకటించనున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

సెన్సెక్స్ నేడు ఉదయం 52,851 పాయింట్ల వద్ద ప్రారంభమై, 53,067 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 52,674 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 15,710 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,797 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 15,661 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ ఉదయం గం.10.20 సమయానికి 138 పాయింట్లు ఎగిసి 52,770 పాయింట్ల వద్ద, నిఫ్టీ 62 పాయింట్లు ఎగిసి 15,689 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.
More From GoodReturns

స్టాక్ మార్కెట్లో బ్లాక్ మండే.. భారీ నష్టాల్లో ట్రేడవుతున్న అన్ని రంగాలు.. ఇన్వెస్టర్లు విలవిల..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications