స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టపోయాయి. సెన్సెక్స్ నేడు (ఏప్రిల్ 12, మంగళవారం) 388 పాయింట్ల నష్టాల్లో ముగిసింది. కేవలం రెండు రోజుల్లోనే సెన్సెక్స్ 871 పాయింట్లు పతనమైంది. నిఫ్టీ 17,600 పాయింట్ల దిగువన ముగిసింది. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2.71 లక్షల కోట్లకు తగ్గింది. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు, ఏ దశలోను కోలుకోలేదు. అయితే మధ్యాహ్నం ఓ సమయంలో దాదాపు 700 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్ చివరలో కాస్త కోలుకొని 388 పాయింట్ల నష్టాల్లో ముగిసింది.
బాండ్స్ రాబడుల పెరుగుదల, ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకుల వడ్డీ రేట్ల పెంపు సంకేతాలు, చైనాలో కరోనా పెరుగుదల, దేశీయంగా కరోనా కొత్త వేరియంట్ ఇన్వెస్టర్లను భయానికి గురి చేస్తున్నాయి. ద్రవ్యోల్భణ ఆందోళనలు ప్రపంచాన్ని భయపెడుతున్నాయి. దీంతో మార్కెట్లు కుప్పకూలాయి. చివరకు సెన్సెక్స్ 388 పాయింట్లు నష్టపోయి 58,576 పాయింట్ల వద్ద, నిఫ్టీ 144 పాయింట్లు క్షీణించి 17,530 పాయింట్ల వద్ద ముగిసింది. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2.71 లక్షల కోట్లుగా ఉంది.

బ్యాంకింగ్ రంగం మినహా అన్ని రంగాలు నష్టాల్లో ముగిశాయి. ఐటీ, మెటల్, రియాల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్, క్యాపిటల్ గూడ్స్ సూచీలు 1 శాతం నుండి 3 శాతం క్షీణించాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు ఒక శాతం మేర తగ్గాయి. నేటి టాప్ గెయినర్స్ జాబితాలో యాక్సిస్ బ్యాంకు, కొటక్ మహీంద్రా, పవర్ గ్రిడ్, మారుతీ సుజుకీ, ఎస్బీఐ లైఫ్ ఇన్సురెన్స్ ఉన్నాయి. టాప్ లూజర్స్లో హిండాల్కో, కోల్ ఇండియా, గ్రాసీమ్, టాటా మోటార్స్, టాటా స్టీల్ ఉన్నాయి.
More From GoodReturns

Stock market: ఐటీ స్టాక్స్ క్రాష్! నిఫ్టీ ఐటీ ఇండెక్స్ డౌన్.. భారీ నష్టాల్లో టాప్ కంపెనీలు!

భారీ నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్.. నిన్న లాభాలన్నీ ఆవిరి..పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

రేపు స్టాక్ మార్కెట్లకు సెలవు.. బ్యాంకులు కూడా పనిచేయవు.. ఈ రోజు పతనానికి విలవిలలాడుతున్న ఇన్వెస్టర్లు..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?



Click it and Unblock the Notifications