ముంబై: నిన్న భారీ నష్టాలనుండి కోలుకొని, అతి స్వల్పలాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ప్రారంభమయ్యాయి. నిన్న చివరి గంటలో సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా లాభపడటంతో నష్టాల నుండి బయటపడింది. నేడు ఉదయం గం.9.16 సమయానికి సెన్సెక్స్ 288.89 పాయింట్లు(0.62%) లాభపడి 46552.06 పాయింట్ల వద్ద, నిఫ్టీ 83.50 పాయింట్లు (0.62%) లాభపడి 13651.40 వద్ద ప్రారంభమైంది.
1094 షేర్లు లాభాల్లో, 250 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 48 షేర్లలో ఎలాంటి మార్పులేదు. మధ్యాహ్నం గం.12 సమయానికి సెన్సెక్స్ 300 పాయింట్లు లాభపడి 46,563 పాయింట్ల వద్ద, నిఫ్టీ 85 పాయింట్లు ఎగిసి 13,653 పాయింట్ల వద్ద ఉంది. డాలర్ మారకంతో రూపాయి 17 పైసలు లాభపడి 73.47 వద్ద ప్రారంభమైంది. క్రితం సెషన్లో 73.64 వద్ద క్లోజ్ అయింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి ప్రారంభ సెషన్లో PSU బ్యాంకు మినహా మిగతా అన్ని రంగాలు లాభాల్లో ఉన్నాయి. ఆటో, మెటల్ రంగాలు భారీగా ఎగిశాయి.
మధ్యాహ్నం గం.12 సమయానికి నేటి టాప్ గెయినర్స్ జాబితాలో మహీంద్రా అండ్ మహీంద్రా 2.62 శాతం, యూపీఎల్ 2.07 శాతం, దివిస్ ల్యాబ్స్ 2.04 శాతం, ఓఎన్జీసీ 1.99 శాతం, టాటా మోటార్స్ 1.96 శాతం ఉన్నాయి.
నేటి లూజర్స్ జాబితాలో ఐచర్ మోటార్స్ 0.78 శాతం, టెక్ మహీంద్రా 0.76 శాతం, గెయిల్ 0.68 శాతం, హెచ్సీఎల్ టెక్ 0.45 శాతం, HDFC లైఫ్ 0.38 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్లో బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, హెచ్డీఎఫ్సీ, టాటా స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా ఉన్నాయి.

మహీంద్రా స్టాక్స్ జంప్
జనవరి నుండి తమ వాహనాల విక్రయాలు పెంచుతున్నట్లు మహీంద్రా అండ్ మహీంద్రా ప్రకటించింది. దీంతో ఈ కంపెనీ స్టాక్స్ నేడు 4 శాతం లాభపడ్డాయి. మధ్యాహ్నం సమయానికి 2.50 శాతం మేర లాభాల్లో ఉంది. పాసింజర్, కమర్షియల్ వెహికిల్స్ ధరలు పెంచుతున్నట్లు మహీంద్రా నిన్న ప్రకటించింది.
రిలయన్స్ స్టాక్ నేడు ప్రారంభ సెషన్లో లాభపడినప్పటికీ, ఆ తర్వాత నష్టాల్లోకి వెళ్లింది. నిన్న రూ.1974.35 వద్ద క్లోజ్ అయినప్పటికీ, నేడు ప్రారంభంలో రూ.1995 వరకు దూసుకెళ్లింది. ఆ తర్వాత నిన్నటి కంటే కిందకు పడిపోయి రూ.1973 వద్ద ఉంది.

రంగాలవారీగా..
నిఫ్టీ 50 సూచీ 0.54 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 1.16 శాతం లాభాల్లో ఉన్నాయి. నిఫ్టీ ఆటో 1.10 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.35 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.55 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.61 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.91 శాతం, నిఫ్టీ ఐటీ 0.46 శాతం, నిఫ్టీ మీడియా 0.23 శాతం, నిఫ్టీ మెటల్ 1.35 శాతం, నిఫ్టీ ఫార్మా 1.01 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ పీఎస్యూ బ్యాంకు మాత్రం 0.34 శాతం మేర నష్టపోయింది.
More From GoodReturns

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

భారత స్టాక్ మార్కెట్లు పతనం.. చమురు ధరలు పెరగడంతో కుప్పకూలిన మార్కెట్

BSE: స్టాక్ మార్కెట్లో సరికొత్త ట్రెండ్.. సెన్సెక్స్లోనే కాకుండా ఇకపై వీటిలోనూ ట్రేడింగ్ చేయెచ్చు!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications