స్టాక్ మార్కెట్లు నేడు (శుక్రవారం, మే 27) లాభాల్లో ప్రారంభమై, రోజంతా ఇదే ఒరవడిని కొనసాగించింది. చివరకు భారీ లాభాల్లో ముగిసింది. నేడు ఉదయం సూచీలు భారీ లాభాల్లో ప్రారంభమై, మధ్యాహ్నం సమయానికి లాభాలు కాస్త తగ్గినప్పటికీ, ఆ తర్వాత మరింత జోరందుకున్నాయి. 400కు పైగా పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్, ఓ సమయంలో 200 దిగువ పాయింట్ల లాభాలకు పడిపోయినప్పటికీ, చివరకు మరింత పుంజుకొని 600 పాయింట్లకు పైగా లాభాల్లో ముగిసింది.
సెన్సెక్స్ ఉదయం 54,671.50 పాయింట్ల వద్ద ప్రారంభమై, 54,936.63 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 54,449.34 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 632.13 పాయింట్లు లేదా 1.17 శాతం లాభపడి 54,884.66 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 182.30 (1.13%) పాయింట్లు ఎగిసి 16,352 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్, నిఫ్టీలు ఒక శాతానికి పైగా లాభాల్లో ముగిశాయి.

అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉన్నాయి. ఇది ఆసియా సహా మన మార్కెట్లకు కలిసి వచ్చింది. దీనికి తోడు డాలర్ ఇండెక్స్ ఇటీవలి గరిష్టాలతో పోలిస్తే భారీగా క్షీణించింది. ఇది మార్కెట్ సెంటిమెంటును బలపరిచింది. ఆర్బీఐ తన వార్షిక నివేదికలో భారత వృద్ధిపై సానుకూల ప్రకటన చేసింది. ఇది ఇన్వెస్టర్ల సెంటుమెంటును బలపరిచింది. ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్స్ మినహా మిగతా అన్ని రంగాలు లాభాల్లో ముగిశాయి. ఐటీ, బ్యాంకింగ్, ఆటో, ఎఫ్ఎంసీజీ రంగాలు టాప్ గెయినర్స్గా ఉన్నాయి.
More From GoodReturns

Stock market: ఐటీ స్టాక్స్ క్రాష్! నిఫ్టీ ఐటీ ఇండెక్స్ డౌన్.. భారీ నష్టాల్లో టాప్ కంపెనీలు!

కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ట్రంప్ ప్రకటనతో అన్ని రంగాలు విలవిల..ఎంతలా అంటే..

రేపు స్టాక్ మార్కెట్లకు సెలవు.. బ్యాంకులు కూడా పనిచేయవు.. ఈ రోజు పతనానికి విలవిలలాడుతున్న ఇన్వెస్టర్లు..

భారీ నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్.. నిన్న లాభాలన్నీ ఆవిరి..పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..



Click it and Unblock the Notifications