మార్కెట్లకు రుచించని నిర్మలమ్మ బడ్జెట్, భారీ నష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు

ముంబై: బడ్జెట్ సమావేశాలకు ముందు స్టాక్ మార్కెట్లు శనివారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.35 సమయానికి సెన్సెక్స్ 38 పాయింట్లు, నిఫ్టీ 88 పాయింట్లు నష్టపోయింది. డాలరుతో రూపాయి మారకం విలువ 71.46 వద్ద ట్రేడ్ అవుతోంది. గత కొద్ది రోజులుగా బడ్జెట్ పైన ఇన్వెస్టర్లు భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ రోజు బడ్జెట్‌కు ప్రతిపాదనలకు అనుగుణంగా మార్కెట్లు పైకి కిందకు తచ్చాడుతూ.. భారీ మార్పులకు లోనయ్యే అవకాశముంది.

బడ్జెట్ ప్రసంగానికి కొద్ది నిమిషాల ముందు మాత్రం సెన్సెక్స్ లాభాల్లోకి వెళ్లింది. గం.10.57 సమయానికి సెన్సెక్స్ 125.85 (0.31%) పాయింట్ల లాభంతో 40,849.34 పాయింట్లతో ఉంది. కానీ నిఫ్టీ మాత్రం 37.65 (0.31%) నష్టంతో 11,998.15కి దిగజారింది. బడ్జెట్ ప్రసంగం సమయంలో స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. బడ్జెట్ ప్రసంగం సాగుతున్న కొద్దీ మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. మధ్యాహ్నం గం.1.30 సమయానికి సెన్సెక్స్ ఏకంగా 700 పాయింట్లకు పైగా పడిపోయి 40,018 వద్ద నిలిచింది. నిఫ్టీ 280 పాయింట్లకు పైగా దిగజారి 11,754 వద్ద ట్రేడ్ అయింది. మార్కెట్లకు నిర్మలమ్మ బడ్జెట్ రుచించలేదు.

మరిన్ని బడ్జెట్ కథనాలు

Sensex, Nifty Open Lower Ahead Of Budget 2020

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మధ్యాహ్నం గం.11కు బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభిస్తారు. దాదాపు గంటన్నరకు పైగా ఈ ప్రసంగం కొనసాగనుంది. సాధారణంగా శనివారం, ఆదివారం మార్కెట్లు ఉండవు. కానీ బడ్జెట్ నేపథ్యంలో ఈ రోజు (ఫిబ్రవరి 1) మార్కెట్లు తెరుచుకున్నాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+