Nifty: భయం మరచిన సూచీలు.. మార్కెట్లో నిఫ్టీ, సెన్సెక్స్ రికార్డుల మోత..
Nifty 19000: మార్కెట్లో నేడు బెంచ్ మార్క్ సూచీల రికార్డుల మోత మోగుతోంది. మనల్ని ఎవడ్రా ఆపేది అన్న పవన్ కళ్యాణ్ డైలాగ్ మాదిరిగా సరికొత్త జీవితకాల గరిష్ఠాలకు చేరుకున్నాయి.
ఈ క్రమంలో సెన్సెక్స్ సూచీ 64,000 పాయింట్లను దాటగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 19,000 పాయింట్ల మార్కును దాటింది. ఈ క్రమంలో నిఫ్టీ-50లోని అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్&సెజ్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ఐషర్ మోటార్స్, బజాజ్ ఫైనాన్స్ టాప్ గెయినర్లుగా ముందుండి సూచీని కొత్త శిఖరాలకు నడిపించాయి. కొన్ని రోజుల క్రితం నిఫ్టీ గత జీవితకాల గరిష్ఠ స్థాయిలను దాటడంలో విఫలమైన తర్వాత కొంత వెనక్కి తగ్గినప్పటికీ 21ema నుంచి వచ్చిన మద్దతుతో నేడు దూసుకుపోతోంది.

గత రెండు వారాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లలో బలమైన కాల్ ఆప్షన్ రైటింగ్ కనిపించిందని నిపుణులు తెలిపారు. దీంతో గతవారం సెన్సెక్స్ తాజా జీవితకాల గరిష్ఠ స్థాయిని తాకిన మొదటి బెంచ్మార్క్ ఇండెక్స్గా నిలిచింది. దీని తర్వాత గ్లోబల్ మార్కెట్లకు అనుగుణంగా కొంత రిట్రేస్మెంట్ జరిగింది. 2021 నుంచి గమనించినట్లయితే అక్టోబరులో మార్కెట్ బలమైన కన్సాలిడేషన్లో ఉంటాయి. అయితే తాజాగా సూచీల్లో బలమైన బ్రేక్ అవుట్ వల్ల రానున్న దీపావళి నాటికి సెన్సెక్స్ సూచీ 70000 వేల మార్కును తాకవచ్చని జీసీఎల్ బ్రోకింగ్ రీసెర్చ్ అనలిస్ట్, వైభవ్ కౌశిక్ అభిప్రాయపడ్డారు.
అదుపులోకి వస్తున్న ద్రవ్యోల్బణం, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ తగ్గుదల, స్థిరమైన విదేశీ ప్రవాహాల కారణంగా సెన్సెక్స్ రికార్డు స్థాయిలో ట్రేడవుతోందని షేర్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అండ్ రీసెర్చ్ హెడ్ డాక్టర్ రవి సింగ్ పేర్కొన్నారు. ప్రస్తుత ర్యాలీకి ఎఫ్ఎంసీజీ, ఐటి రంగాల్లో నెలకొన్న బలమైన వృద్ధి కారణమని అన్నారు. ఇదే జోరు ఫార్మా, ఆటో, బ్యాంకింగ్ రంగాలు కొనసాగుతాయని అభిప్రాయపడ్డారు. సెన్సెక్స్లో అప్ట్రెండ్ కారణంగా సమీప కాలంలో 65,000 పాయింట్ల మార్కును చేరుకోవచ్చని వెల్లడించారు.


Click it and Unblock the Notifications