ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం ఉదయం లాభాల్లో ప్రారంభమయ్యాయి. గం.9.16 సమయానికి సెన్సెక్స్ 154.05 పాయింట్లు లేదా 0.42% ఎగిసి 36,483.06 వద్ద, నిఫ్టీ 40 పాయింట్లు లేదా 0.37% లాభపడి 10,745.80 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. ఆ తర్వాత మధ్యాహ్నం గం.12.47 సమయానికి సెన్సెక్స్ 315 పాయింట్ల లాభాల్లోకి వెళ్లింది. 740 షేర్లు లాభాల్లో, 327 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా 34 షేర్లలో ఎలాంటి మార్పు లేదు.
మధ్యాహ్నం సమయానికి ఎఫ్ఎంసీజీ, ఆటో, ఐటీ రంగాలు మినహా మిగతావి లాభాల్లో ఉన్నాయి. ఫైనాన్షియల్, మెటల్ స్టాక్స్ భారీగా ఎగిశాయి. టాప్ గెయినర్స్ జాబితాలో హిండాల్కో, బజాజ్ ఫైనాన్స్, గెయిల్, టాటా స్టీల్, హెచ్డీఎఫ్సీ ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో భారతీ ఎయిర్ టెల్, హీరో మోటో కార్ప్, విప్రో, టెక్ మహీంద్రా, యూపీఎల్ ఉన్నాయి.

నిన్న అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు కూడా సానుకూలంగా ఉన్నాయి. నేడు ఐటీ దిగ్గజం టీసీఎస్ క్వార్టర్ ఫలితాలను ప్రకటించనుంది. మొత్తం 19 కంపెనీలు ప్రకటించనున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
అయిదు రోజుల పాటు వరుసగా లాభాలు మూటగట్టుకున్న మార్కెట్లు నిన్న నష్టపోయిన విషయం తెలిసిందే. ట్రేడింగ్ చివరలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. దీంతో సెన్సెక్స్ 346 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 94 పాయింట్ల నష్టంతో ముగిసింది. డాలర్ మారకంతో రూపాయి కూడా 9 పైసలు తగ్గి 75.02 వద్ద ముగిసింది. నేడు తిరిగి కోలుకున్నాయి.
More From GoodReturns

బెంగళూరు రియల్ ఎస్టేట్.. ఈ ఒక్క కారిడార్కు పుల్లు డిమాండ్.. ఇళ్లను ఎగబడి కొంటున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

కుప్పకూలిన భారత ఐటీ స్టాక్స్.. కొంపలు ముంచిన ఎన్విడియా AI ప్రకటన.. ఆందోళనలో ఇన్వెస్టర్లు..

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల చూస్తే పసిడి జోలికే పోరు.. మార్చి 17, మంగళవారం ధరలు ఇవే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు తగ్గిపోతున్నాయి.. ఈ రోజు ఎంత ఢమాల్ అయిందంటే.. మార్చి 16, సోమవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

బంగారం ధరలు పెరుగుదలపై షాకింగ్ న్యూస్..అసలైన కారణం తెలిపిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రీజినల్ సీఈఓ సచిన్ జైన్..

బంగారం ధరల పెరుగుదలపై UBS సంచలన నివేదిక.. పసిడి పెట్టుబడిదారులకు పండగే పండగ..

మార్కెట్ క్రాష్ సమయంలో ఇన్వెస్టర్లకు నగదు చాలా కీలకం.. రాబర్ట్ కియోసాకి సంచలన వ్యాఖ్యలు..



Click it and Unblock the Notifications