నష్టాల్లో ముగిసిన మార్కెట్లు: సెన్సెక్స్ 120 పాయింట్లు పతనం
స్టాక్ మార్కెట్లు సోమవారం (జూలై 26) నష్టాల్లో ముగిశాయి. నేడు ఉదయం ఉదయం ఊగిసలాటలో ప్రారంభమైన మార్కెట్లు, ఓ దశలో మంచి లాభాల్లోకి వచ్చాయి. అయితే అంతలోనే తిరిగి నష్టాల్లోకి వెళ్లాయి. ఉదయం గం.11.30 గంటలకు నష్టాల్లోకి వెళ్లిన సూచీలు ఏ దశలోను కోలుకోలేదు. పైగా అంతకంతకూ కిందకు దిగజారాయి చివరకు సెన్సెక్స్ వంద పాయింట్లకు పైగా నష్టంతో ముగిసింది.
దిగ్గజ కంపెనీలు ఐసీఐసీఐ, ఇన్ఫోసిస్, కొటక్ మహీంద్రా, బజాజ్ ఫిన్ సర్వ్ నుండి మద్దతు లభించగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ నుండి భారీ నష్టం నమోదు కావడంతో నష్టపోయాయి. సెన్సెక్స్ 123.53 (0.23%) పాయింట్లు నష్టపోయి 52,852.27 పాయింట్ల వద్ద, నిఫ్టీ 31.60 (0.20%) పాయింట్లు నష్టపోయి 15,824.45 పాయింట్ల వద్ద ముగిసింది.
నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్లో ఐసీఐసీఐ బ్యాంకు, రిలయన్స్, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యు స్టీల్, ఐటీసీ ఉన్నాయి. టాప్ గెయినర్స్ జాబితాలో ఎస్బీఐ లైఫ్ ఇన్సురా, బజాజ్ ఫిన్ సర్వ్, హిండాల్కో, దివిస్ ల్యాబ్స్, అల్ట్రా టెక్ సిమెంట్ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో జేఎస్డబ్ల్యు స్టీల్, విప్రో, రిలయన్స్, ఎస్బీఐ, మహీంద్రా అండ్ మహీంద్రా ఉన్నాయి.