ముంబై: భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం (ఆగస్ట్ 7) ఫ్లాట్గా క్లోజ్ అయ్యాయి. ఉదయంకూడా ఫ్లాట్గానే ప్రారంభమైన మార్కెట్లలో ఆద్యంతం ఒడిదుడుకులు కొనసాగి, చివరకు అతిస్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 15 పాయింట్లు లాభపడి 38,040 వద్ద, నిఫ్టీ 14 పాయింట్లు ఎగిసి 11,214 వద్ద ముగిసింది.
మార్కెట్లు ముగిసే సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో ఏషియన్ పేయింట్స్, బజాజ్ ఫైనాన్స్, యూపీఎల్, ఇండస్ ఇండ్ బ్యాంకు, బజాజ్ ఫిన్ సర్వ్ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో టైటాన్ కంపెనీ, హెచ్సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, మహీంద్రా అండ్ మహీంద్రా, సన్ ఫార్మా ఉన్నాయి. ఐటీ, ఫార్మా రంగాలు నష్టాల్లో ముగిశాయి. దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

మార్కెట్లను ప్రభావితం చేయగలిగే అంశాలు లేకపోవడం, ట్రేడర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడం, వారంతం కావడం, కరోనా కేసులు పెరగడం వంటి వివిధ అంశాలు మార్కెట్లు ఫ్లాట్గా ఉండేందుకు కారణంగా కనిపిస్తోంది. ట్రంప్ నిర్ణయం సహా వివిధ కారణాలతో ఐటీ రంగం ఇంకా ఒత్తిడిలోనే కొనసాగుతోంది.
డాలర్ మారకంతో రూపాయి ఓ సమయంలో 12 పైసలు నష్టపోయి 75.05 వద్ద ట్రేడ్ అయింది. ఆ తర్వాత కోలుకొని చివరకు 74.93 వద్ద క్లోజ్ అయింది. 74.91 నుండి 75.05 మధ్య ట్రేడ్ అయింది. రూపాయి ఈ ఏప్రిల్ నెలలో డాలర్ మారకంతో 76.91 వద్ద ఆల్ టైమ్ కనిష్టం వద్ద ట్రేడ్ అయింది.
More From GoodReturns

బంగారం ధరలు ఈ రోజు కూడా ఢమాల్..ఇంకా తగ్గేదాకా వెయిట్ చేయండి.. మార్చి 14, శనివారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వదిలి ఐర్లాండ్కు.. ఖర్చు పెరిగినా సంతోషంగా ఉన్నానంటున్న టెక్కీ!

బెంగళూరు రియల్ ఎస్టేట్.. ఈ ఒక్క కారిడార్కు పుల్లు డిమాండ్.. ఇళ్లను ఎగబడి కొంటున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

కుప్పకూలిన భారత ఐటీ స్టాక్స్.. కొంపలు ముంచిన ఎన్విడియా AI ప్రకటన.. ఆందోళనలో ఇన్వెస్టర్లు..

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల చూస్తే పసిడి జోలికే పోరు.. మార్చి 17, మంగళవారం ధరలు ఇవే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు తగ్గిపోతున్నాయి.. ఈ రోజు ఎంత ఢమాల్ అయిందంటే.. మార్చి 16, సోమవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

బంగారం ధరలు పెరుగుదలపై షాకింగ్ న్యూస్..అసలైన కారణం తెలిపిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రీజినల్ సీఈఓ సచిన్ జైన్..



Click it and Unblock the Notifications