ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 6వ రోజు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీ ఏడు నెలల గరిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ 303.72 పాయింట్లు (0.76%) లాభపడి 40,182.67 వద్ద, నిఫ్టీ 95.70 పాయింట్లు (0.82%) ఎగిసి 11,834.60 పాయింట్ల వద్ద ముగిసింది. 1,215 షేర్లు లాభాల్లో, 1,419షేర్లు నష్టాల్లో ముగియగా, 159 షేర్లలో ఎలాంటి మార్పు లేకుండా క్లోజ్ అయ్యాయి. అన్ని రంగాలు కూడా లాభాల్లో ముగిశాయి. ఐటీ ఇండెక్స్ ఏకంగా 3 శాతం లాభపడింది. ఫార్మా, బ్యాంకు స్టాక్స్ కూడా మంచి లాభాలు నమోదు చేశాయి. అందుకు విరుద్ధంగా ఎనర్జీ, ఎఫ్ఎంసీజీ స్టాక్స్లో అమ్మకాలు వెల్లువెత్తాయి.

ఐటీ స్టాక్స్ అదరగొట్టాయి
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సహా వివిధ ఐటీ రంగ సంస్థల స్టాక్స్ ఎగిశాయి. దీంతో నిఫ్టీ ఐటీ భారీ లాభాల్లో ముగిసింది. ఐటీ స్టాక్స్లో చాలా వరకు రికార్డులు నెలకొల్పాయి. దీంతో నిఫ్టీ ఐటీ 16 ఏళ్ల గరిష్టాన్ని తాకింది.
టీసీఎస్ షేర్ ధర 3 శాతం లాభపడి రూ.2,818, హెచ్సీఎల్ టెక్ 2.59 శాతం ఎగిసి రూ.850 వద్ద, ఇన్ఫోసిస్ షేర్ ధర 2.62 శాతం పెరిగి రూ.1,094 వద్ద, టెక్ మహీంద్ర షేర్ 1.91 శాతం ఎగిసి రూ.862.50, విప్రో షేర్ ధర 7.34 శాతం లాభపడి రూ.359.90 వద్ద, కోఫోర్జ్ షేర్ 3.28 శాతం లాభపడి రూ.2,474 వద్ద, మైండ్ ట్రీ షేర్ 5.77 శాతం లాభపడి రూ.1,468 వద్ద ముగిసింది. ఐటీ స్టాక్స్లో విప్రో 7 శాతానికి పైగా లాభాల్లో ముగిసింది. విప్రో బోర్డు కూడా షేర్ల బైబ్యాక్కు సిద్ధమవుతున్నట్లు వార్తలు రావడంతో స్టాక్ 20 ఏళ్ల గరిష్టాన్ని తాకింది. అక్టోబర్ 13న బైబ్యాక్ పైన ప్రకటన చేయవచ్చు.

ప్రాఫిట్ బుకింగ్
నిఫ్టీ బ్యాంకు 227 పాయింట్లు లాభపడి 23,191 వద్ద ముగిసింది. మిడ్ క్యాప్ ఇండెక్స్ 18 పాయింట్లు ఎగిసి 17,146 వద్ద క్లోజ్ అయింది. ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియాలో ప్రాఫిట్ బుకింగ్లో కనిపించాయి. నిన్న ఈ స్టాక్స్ భారీగా లాభపడటంతో ఈ రోజు ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది. వేదాంత స్టాక్స్ ఒత్తిడిలో కూరుకుపోయాయి. ఈ వారం ఇప్పటి వరకు 14 శాతం నష్టపోయింది. జస్ట్ డయల్, కాడిల్లా హెల్త్ కేర్, బయోకాన్, అపోలో హాస్పిటల్స్ లాభాల్లో ముగిశాయి.

చివరి గంటలో..
టాప్ గెయినర్స్ జాబితాలో విప్రో, సిప్లా, టీసీఎస్, అల్ట్రా టెక్ సిమెంట్, హెచ్సీఎల్ టెక్ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో గెయిల్, ఓఎన్జీసీ, ఐటీసీ, ఐచర్ మోటార్స్, కోల్ ఇండియా ఉన్నాయి. నేడు యాక్టివ్ స్టాక్స్లో టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, రిలయన్స్ ఉన్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ రోజు 0.71 శాతం నష్టపోయి 2,241.50 వద్ద క్లోజ్ అయింది.
సెన్సెక్స్ ఓ దశలో 600 పాయింట్ల దిశగా దూసుకెళ్లింది. చివరి గంటలో అమ్మకాలు వెల్లువెత్తడంతో 303 పాయింట్ల లాభాలతో ముగిసింది.
More From GoodReturns

Sensex today: సెన్సెక్స్ సంచలనం: 20 నిమిషాల్లో 900 పాయింట్లు జంప్.. కారణం ఇదే!

మూడో రోజూ కుప్పకూలిన స్టాక్ మార్కెట్..రికార్డు కనిష్టానికి రూపాయి.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

భారత స్టాక్ మార్కెట్లు పతనం.. చమురు ధరలు పెరగడంతో కుప్పకూలిన మార్కెట్

BSE: స్టాక్ మార్కెట్లో సరికొత్త ట్రెండ్.. సెన్సెక్స్లోనే కాకుండా ఇకపై వీటిలోనూ ట్రేడింగ్ చేయెచ్చు!

భారీ నష్టాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్..రూ. 9 లక్షల కోట్ల నష్టం.. సెన్సెక్స్, నిఫ్టీ పతనం..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!



Click it and Unblock the Notifications